జానా మాటలు వింటుంటే .. గతంలో కెఎ పాల్ ను ప్రజలు రాజకీయాల్లోకి రామ్మని లక్షల మంది అడగటంతో.. ఆయన రాజకీయ పార్టీ పెట్టి రాజకీయల్లోకి రావటం జరిగిందని అనేక సార్లు మీడియా ముందు చెప్పటం జరిగింది. పాల్ కొన్ని చోట్ల కూడా పోటీ చేయటం కూడా జరిగినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. పాపం చివరకు ఆ ప్రజలే.. పాల్ జైల్లో కాపురం పెడతాడని ఊహించలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మంత్రి జానారెడ్డి ని కూడా ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని మంత్రి చెబుతున్నాడు. ప్రజలు మాత్రం 5 సంవత్సరాలలో జానా ఇంత డబ్బు ఎలా సంపాదించారని ప్రజలు గుసగుసలాడుకుంటున్న విషయం జానాకు తెలియకపోవడం విశేషం. పరిణామ క్రమంలో మార్పును ఎవరూ అడ్డుకోలేరని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి మరోసారి బలంగా ప్రజలు జానా కోరు కుంటున్నారు.. రాష్ట్రం లోని తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం మార్పు తప్పదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు బహిరంగంగానే ప్రకటనలు గుప్పిస్తున్న సమయంలో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన జానా, డీఎస్, పొన్నాల, గీతారెడ్డి వంటి తెలంగాణ సీనియర్లు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. .
ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డిని ఆ పదవి నుంచి తప్పిస్తే, తాజా ఎంపికలో నూతన ముఖ్యమంత్రిని తెలంగాణ నుంచి ఎంపిక చేయాలని ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లుఢిల్లీ నాయకులు అంటున్నారు. అదే క్రమంలో తాజా గా రాష్ట్రంలో నెలకున్న తక్షణ సవాళ్లను కూడా అధిగమించే నాయకుడు కోసం అధిష్టానం అన్వేషణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ముఖ్య నేతలతో అధి ష్టానం దూతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అదే విధంగా నిఘా వర్గాలతో పాటు గవర్నర్ కూడా ఒక నివేదికను కేంద్రానికి అందచేసినట్లు సమాచారం. మరో వైపు తెలంగాణ తదితర సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడంతో పాటు రాష్ట్ర ప్రజల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై నమ్మకం, విశ్వాసం కలిగించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని అధిష్టాన వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ను కట్టడి చేయడంతో పాటు, ఆ పార్టీ ముఖ్య నేతను సైతం ప్రభావితం చేయగలిగే సీనియర్వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో కులాల లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు కాంగ్రెస్కు వెన్నంటి ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని తిరిగి ఆకర్షించాలని, అప్పుడే పార్టీ పూర్వ వైభవం సాధ్యమవుతుందని ఆ వర్గానికి చెందిన సీనియర్ నేతలు యువ నేత రాహుల్ కూడా ఒక నివేదికను సమ ర్పించినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి .
అయితే అధిష్టానం తాజా జాబితాలో జానారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అదే సందర్భంలో సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఇప్పటికే తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా ఢిల్లీ నుంచి జానాకు పిలువు వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఆయనకు అత్యంత సన్నిహితులు అంటున్నారు. ముఖ్య మంత్రి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని, ఈ రకమైన సహజ మార్పును ఎవ్వరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టంగా చెబుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more