జగన్ను అన్యాయంగా అరెస్టు చేశారని విజయమ్మ అంటుంది. . వైయస్ ద్వారా లబ్ధి పొందిన వారు ఎందరో జగన్కు కష్టకాలంలో అండగా నిలబడలేదని, కేవలం కొండా సురేఖ మాత్రమే నిలబడ్డారన్నారట . ఆమె తెలంగాణ కోసమే రాజీనామా చేస్తే ఉద్దేశ్య పూర్వకంగా ఆమోదించలేదని, ఆ తర్వాత రైతులు కోసమంటూ రాజీనామా ఆమోదించారని . ఈ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు , పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్ విజయమ్మ పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించారని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అంటున్నారు ఆమె వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు. తెలంగాణ మనోభావాలు గుర్తించి జగన్ చెప్పాడని , అమరవీరుల కోసం శ్రద్ధాంజలి కూడా ఘటించాడని , గత ఉప ఎన్నికలలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులపై పార్టీ తరఫున పోటీకి నిలబెట్టలేదని విజయమ్మ పరకాల ప్రజలకు చెబుతుందని మీడియా వర్గాలు అంటున్నాయి.
జగన్ తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తున్నందున కొండా సురేఖకు ఓటు వేసి ఆమెను సీమాంధ్ర ప్రాంతంలోని పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని విజయ్మ విజ్ఞప్తి చేస్తున్నారట . తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చే వారని, తెలంగాణ వచ్చినప్పుడు వస్తుందని కానీ అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారని తెలంగాణ ప్రజలకు విజయమ్మ చెబుతుంది. అందుకోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని, ప్రాణహిత - చేవెళ్ల ఆయన మానస పుత్రిక లాంటి పెట్టింది వైయసేనట. వైయస్ జగన్ గతంలో వచ్చినప్పుడు కొంత అడ్డంకులు ఎదురయ్యాయని, మళ్లీ జగన్ ఇక్కడకు వస్తాడని చెబుతుంది.
అంటే గతంలో.. వైఎస్ జగన్ ను తెలంగాణ లో అడుగు పెట్టకుండా రాళ్లతో ఫైరింగ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఈ సారి ఏమైంది. ఎందుకు వైఎస్ విజయమ్మను అడ్డుకోలేదు. కొండ దంపతులకు టీఆర్ఎస్ పార్టీ భయపడిందా? లేక జగన్ పార్టీ నుండి పెద్ద మొత్తం వనరులు వచ్చాయా? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. గతంలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేయటానికి తెలంగాణ అడుగుపెడితే.. చంపుతాం, జగన్ కు తెలంగాణ దెబ్బ ఏమిటో చూపిస్తాం అని .. ఘాటైన మాటలు విసిరిన టీఆర్ఎస్ పార్టీ ఏమైంది? ఆ పార్టీ మౌనం వెనక దాగిన రహస్యం ఏమిటి? వైఎస్ విజయమ్మను పరకాలలో ఎలా అడుగు పెట్టానిచ్చారు? అనే ప్రశ్రలు తెలంగాణ ప్రజల్లో సుడులు తిరుగుతున్నాయాని మీడియా వర్గాలు అంటున్నాయి.
లోకల్ పార్టీ తెలంగాణ కోసం సమైక్యవాదుల పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎందుకు ఇచ్చింది? అంటే ఆ పార్టీ ఈ పార్టీకి ఆర్థికంగా ఆదుకోని ఉంటుందని బీజేపి పార్టీ నాయకులు అంటున్నారు. ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గానీ , ఎవ్వరు విజయమ్మను అడ్డుకోలేకపోయారట. ఒక బీజేపి పార్టీ మాత్రమే ఆమెకు వ్యతిరేకమాని కొండ సురేఖ అభిమానులు చెబుతున్నారు. దీనిబట్టి పరకాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిసే దిశగా ప్రయాణిస్తుందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. దీనిని బట్టి చూస్తుంటే.. ‘‘ కొడుకు కు రాళ్ల వర్షం... అమ్మకు పూల వర్షం’’ కురిపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని తెలుగు దేశం , కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more