బత్తిన సోదరులు పంపిణి చేసే చేప మందు పెద్ద వివాదం అయింది. దీనికి కారణం ప్రభుత్వమే అని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం వైఫల్యం వలన చేప మందుకు వచ్చిన ప్రజలు అనేక ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది. ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం దెబ్బతీసింది. కొన్ని వేల మంది ప్రజలు నమ్మకంతో చేప మందు తీసుకుంటున్నారు. అలాంటి నమ్మకాన్ని ప్రభుత్వం విఫలం చేసింది. ప్రజల కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు తీసుకోకపోవటం వలనే నేడు బత్తిన సోదరుల చేప మందు పంపిణీ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగి.. ఒక మరణించినట్లు తెలుస్తుంది. దీని కారణం ప్రభుత్వమే అని ప్రజలు అంటున్నారు. సరియైన సదుపాయలు కల్పించకపోవటంతో.. ఇంత ఘోరమైన పని జరిగిందని ప్రజలు అంటున్నారు. బత్తిన సోదురుల చేప మందు కోసం ఎందుకు నిధులు విడుదల చేయలేదో ఎవరికి అర్థం కావటంలేదట. కానీ మొన్న భద్రాచలం లో జరిగిన యాగానికి 50 లక్షలు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం .. ఈ చేప మందు విషయం ఎందుకు వెనకడుగు వేసిందని ప్రజలు అంటున్నారు.
ప్రజల నమ్మకం పై ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూసిందని జన విజ్ననావేధిక లాంటి వారు చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది కిరణ్ సర్కార్ వల్లనే ఈ వైపల్యం జరిగిందని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బత్తిన సోదరులకు నిజాం గ్రౌండ్ ను కేటాయించి వారికి అన్ని సదుపాయలను సకలంలో సమాకూర్చారని ప్రజలు అంటున్నారు. అప్పుడు అందరికి అందుబాటులో ఉండే విధంగా చంద్రబాబు ప్లాన్ చేయటంతో ఎంతోమందికి బత్తిన సోదరుల చేప మందు దక్కిందని ప్రజలు అంటున్నారు. కిరణ్ సర్కార్ వైఫల్యం వలన ప్రజలు అనే ఇబ్బందులు పడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
ఈ రోజు చేప మందు పంపిణి ఈ విధంగా జరిగింది. బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, సుమారు 40 మందికి పైగా గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. మృతిచెందిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన గోరఖ్పాటిల్గా గుర్తించారు. గాయపడిన వారంతా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలియవచ్చింది.
ఈరోజు ఉదయం బత్తిన సోదరులు చేప మందు పంపిణి ప్రారంభం కాగానే ఒక్కసారిగా జనం తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు నియంత్రించలేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఊపిరి ఆడక మహిళలు, ముసలివాళ్ళు పెద్ద పెద్దగా కేకలు వేశారు.
చేపమందు కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు కాటేదాన్‑లో సరైన సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మంచినీరు, ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, మహిళలు, వృద్దులతో వచ్చిన వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది.
పట్టించుకునే వారు ఎవరూ లేకపోవడంతో చేసేదేమీ లేక గతరాత్రి రోడ్లపైనే పడుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కాకుండా స్థలం కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు మార్చడంతో ఇక్కడికి చేరుకోవడమే కష్టంగా మారిందని చేపమందు కోసం వచ్చినవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more