వైఎస్ జగన్ కన్ను బతికున్న నాయకులను వదిలిపెట్టి .. చనిపోయిన నాయకులపై పడింది. జగన్ వారిని మంచి చేసుకొనే పనిలో పడ్డాడు. చనిపోయిన నాయకులను మంచి చేసుకొని .. తమ పార్టీని విజయపదంలో నడిపించాలని వైఎస్ జగన్ ఆలోచనట.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును రాజకీయ వారసత్వాన్ని కూడా సొంతం చేసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లున్నారు.
ఆయన తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని దెబ్బ తీయడానికి ఆయన ఎన్టీఆర్ వారసత్వాన్ని సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలకు అత్యంత ఆదరణీయుడైన ఎన్టీ రామారావును సొంతం చేసుకోవడం ద్వారా తెలుగుదేశం సంప్రదాయ ఓటర్లను కూడా సందేహంలో పడేసి తన వైపు లాక్కునే ప్రయత్నాలను ఆయన ప్రారంభించారని చెప్పవచ్చు.
పేదల ప్రజల మేలు కోరింది ఎన్టీ రామారావు తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమేననే అభిప్రాయం కలిగించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గండి కొట్టారని ఆయన అప్పుడప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. అనంతపురంలో చేనేత కార్మికులపై చేపట్టిన ప్రదర్శనలో జగన్ ఎన్టీ రామారావును ప్రశంసించారు. చేనేత కార్మికులకు ఎన్టీ రామారావు మేలు చేశారని, ఆ తర్వాత వారి గురించి ఆలోచించింది వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రమేనని ఆయన అన్నారు.
చంద్రబాబు ఎన్టీ రామారావు వారసత్వాన్ని కొనసాగించడం లేదని, పేరును మాత్రమే వాడుకుంటున్నారని, ఎన్టీ రామరావు నడిపినన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదని, చంద్రబాబు నాయకత్వంలో పూర్తిగా మారిపోయిందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి సమయం దొరికినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు. నందమూరి, నారావారి కుటుంబాలకు మధ్య వారసత్వ పోరు సాగుతుందనే వార్తల నేపథ్యంలో ఎన్టీ రామారావును జగన్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more