పీసీసీ అధ్యక్ష పదవిని తెలంగాణకు ఇవ్వాలని మాజీ మంత్రి దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆజాద్, సోనియా కార్యదర్శి అహ్మద్పటేల్లతో ఆయన మావేశమయ్యారు. తిరిగి హైదరాబాద్ వెళ్లే ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తారన్న ఉద్దేశంతో తాము ఇప్పటి వరకూ పదవుల్ని తాము కోరలేదని అన్నారు. అయితే తెలంగాణ వచ్చేలోపు పార్టీ పరిస్థితిని బలోపేతం చేయాలంటే ఈ ప్రాంతం నాయకులకు పదవులివ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, స్పీకర్, మండలి అధ్యక్షుడు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్.. ఇలా పార్టీ, ప్రభుత్వ పదవులన్నీ ఆంధ్రా ప్రాంత వ్యక్తులే అనుభవిస్తున్నారని వివరించారు.
రెండుచోట్ల పోటీ చేసి, ఒకచోట ఓడిపోయిన నాయకుడికీ, ఆయన వెంట పార్టీలోకి వచ్చిన వారికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తుచేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టేస్తూ.. వాళ్లే పార్టీకి వెన్నుదన్ను అంటున్నారని వాపోయారు. కాగా తెలంగాణ ప్రాంత నాయకులకు న్యాయం చేస్తామని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఏప్రిల్లో ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆజాద్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. తాను అవకాశాలను బట్టి జెండాలు మారుస్తున్నానంటూ కొందరు విమర్శించడాన్ని ఖండించారు. నిజానికి పార్టీలు, జెండాలు మార్చింది వారేనని గుర్తు చేశారు.
అయితే.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఆజాద్ కేరళ పర్యటనకు వెళ్తుండడంతో జాబితాను తక్షణమే ఫాక్స్లో పంపాలని బొత్సను కోరారు. దీంతో.. వెను వెంటనే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఫాక్స్లో ఆజాద్కు బొత్స పంపారు. ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులను ఖరారు చేయడంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పై చేయి సాధించినట్లు తెలుస్తోంది. ఏడు స్థానాలకు కిరణ్ రూపొందించిన అభ్యర్థుల జాబితానే ఎఐసిసి ఖరారు చేసి ప్రకటన చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వెళ్ళిన బొత్సతో అధిష్టానం మాటమాత్రానికైనా చర్చించలేదు.
రెండు మూడు నియోజకవర్గాల్లో పేర్ల విషయమై తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఆయన ఢిల్లీ వెళ్ళినట్లు తెలిసింది. విమానాశ్రయంలో దిగిన మరుక్షణమే ఎఐసిసి జాబితాను విడుదల చేయడంతో బొత్స కంగుతిన్నారు. ఢిల్లీ వచ్చిన తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన ఢిల్లీ పర్యటన వివరాలు తెలియకపోయినా ఉప ఎన్నికల అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తామన్న విషయాన్ని తనకు చెప్పకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 2009 ఎన్నికల సమయంలోనూ వైఎస్ రాజశేఖర్రెడ్డి అధిష్టానం వద్ద చక్రం తిప్పి 290 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడుగా డి.శ్రీనివాస్ ఉన్నా ఆయనకు జాబితా విడుదలను ఎఐసిసి తెలియజేయలేదు. ఇప్పుడు కిరణ్కుమార్రెడ్డి కూడా బొత్సకు తెలియనీయకుండా జాబితా విషయంలో జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది.
అయితే.. కేరళ పర్యటన హడావిడిలో ఉన్న ఆజాద్.. తన వద్దకు వచ్చిన జాబితాను ఆమోదించి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. ఆమె కూడా ఈ జాబితా వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆమోద ముద్ర వేశారు. ఆమె నుంచి జాబితా బయటకు వచ్చిన వెంటనే ఏఐసీసీ వర్గాలు జాబితాను ప్రకటించాయి. ఈ విషయాన్ని తక్షణమే బొత్సకు ఆజాద్ వివరించారు. మొత్తానికి హైదరాబాద్లో విమానం ఎక్కే సమయంలో బొత్స పంపిన జాబితా ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో దిగకముందే ఆమోదం పొందడంతో రాజకీయంగా ఆసక్తిని రేపింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more