రెండు మద్యం సిండికేట్ల మధ్య రాజీ కుదిర్చినందుకే మంత్రి మోపిదేవి వెంకటరమణకు పదిలక్షల రూపాయలు ఇచ్చానని మ ద్యం వ్యాపారి నున్న వెంకటరమణ మరోసారి స్పష్టం చే శారని తెలిసింది. ఈమేరకు ఆయన వెల్లడించిన సమాచారంతో ఏసీబీ రెండో కన్ఫెషన్ రిపోర్ట్ తయారు చేసిన ట్లు తెలిసింది.
ఖమ్మం సిండికేట్ కింగ్ రమణను ఏడు రోజులపాటు కస్టడీలో విచారించిన ఏసీబీ అధికారులు.. మోపిదేవి ముడుపులు తీసుకున్నట్లుగా నిరూపించేందుకు అవసరమైన మరిన్ని ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. కస్టడీలో రమణ వెల్లడించిన కీలక ఆధారాలను ప్రస్తావిస్తూ ఒకట్రెండు రోజుల్లో ఏసీబీ.. ప్రత్యేక కోర్టుకు నేరాంగీకార వాంగ్మూలాన్ని సమర్పించనున్నట్లు సమాచారం. ‘‘ఖమ్మంలో సిండికేట్ వ్యాపారంలో చేరేందుకు ఓ మద్యం దుకాణం యజమాని నిరాకరించారు. ఎంఆర్పీ కంటే తక్కువ ధరకు మద్యం విక్రయించేవారు. దీంతో మాకు తీవ్ర నష్టం వచ్చింది. సిండికేట్లో చేరని సదరు దుకాణం యజమాని లెసైన్స్ను రద్దు చేయాలని ఎక్సైజ్ డీసీని సంప్రదించాను. ఆయన ద్వారా ఆ దుకాణం లెసైన్స్ను రద్దు చేయించాను. అయితే మంత్రి మోపిదేవి వెంకటరమణను సంప్రదించి లెసైన్స్ రద్దు కాకుండా ఆ దుకాణం యజమాని ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో మా వివాదాన్ని పరిష్కరించాలని ఇరువర్గాలం మోపిదేవిని సంప్రదించాం. రెండు ఇన్నోవా వాహనాల్లో దాదాపు 14 మంది వ్యాపారులం బంజారాహిల్స్లోని మంత్రుల క్వార్టర్లలో ఉన్న మోపిదేవి ఇంటికి వెళ్లాం. మా పంచాయితీ పరిష్కరించాలని కోరాం. సిండికేట్లో చేరేందుకు సదరు మద్యం వ్యాపారి నిరాకరించడంతో మా మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఒక దశలో కొట్టుకునేంత వరకూ వెళ్లింది. ఈ దశలో మోపిదేవి జోక్యం చేసుకొని ఇరువర్గాల నుంచి ఇద్దరు చొప్పున ఉంచి మిగిలిన వారిని బయటకు పంపించారు. కలిసి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. సిండికేట్లో చేరాలని సదరు వ్యాపారికి స్పష్టం చేశారు. మా మధ్య వివాదాన్ని పరిష్కరించినందుకు మోపిదేవి మిత్రుడు రాజాబాబు, మధ్యవర్తి బాబ్జీ సమక్షంలో రూ.10 లక్షలు ఇచ్చాం’’ అని రమణ తన నేరాంగీకార వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.ఖమ్మంలో పట్టుబడ్డ సిండికేట్ వ్యాపారి వెంకటరమణను ఏసీబీ అధికారులు రెండో విడత ప్ర శ్నించారు. మంత్రికి పదిలక్షల రూపాయలు ఎందుకు ఇ వ్వాల్సి వచ్చింది? అసలేం జరిగిందన్న వివరాలను ర మణ నుంచి తెలుసుకున్నారని సమాచారం.
ఖమ్మం జి ల్లాలోని ఒక మద్యం సిండికేట్ నిర్వాహకులు తమ సిం డికేట్ ధరలకన్నా తక్కువకు మద్యం అమ్ముతుండటంతో రెండు సిండికేట్ల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయని నున్న రమణ వివరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారుల చేత ప్రత్యర్థి సిండికేట్ వ్యాపారులపై దాడులు చేయించి కేసులు నమోదు చేయించామని వెల్లడించినట్లు సమాచారం. బాధిత సిండికేట్ వ్యాపారులు మంత్రి మోపిదే విని కలిసి తమ వివాదం గురించి చెప్పారని, మంత్రి తన ఇంటికే ఇరువర్గాలను పిలిపించారని, ఆ సమయంలో ఇరువర్గాలు బాహాబాహీకి సిద్ధపడ్డారని చెప్పినట్లు తెలిసింది. దీంతో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. రెండు గ్రూపుల నుంచి ఇద్దరేసి ప్రతినిధులతో మాట్లాడి రాజీ కుదిర్చారని వెల్లడించిన ట్లు సమాచారం.
దీనికి ప్రతిఫలంగా తాను రెండు రోజు ల తర్వాత మంత్రి స్నేహితుడైన రాజబాబు, బాబ్జీ అనే వారి ద్వారా పదిలక్షల రూపాయలను మంత్రికి అందచేశానని రమణ వివరించినట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more