రాష్ట్రంలో జరగబోతున్న ఉప ఎన్నికలలో తమ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీలు రంగంలోకి దిగాయి. ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకోవాలి అనే ఆలోచనలతో పార్టీలు సతమతమవుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ మీద పోటీ చేయ్యటానికి కొత్త పార్టీ రావటంతో.. ఉప ఎన్నికల పోటీ ఎక్కువ గా ఉంది. కాంగ్రెస్ , తెలుగు దేశం , వైఎఆర్, టీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. వీరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమ పార్టీ గెలుస్తుందని పొత్తుల కోసం ఎదురు చూస్తున్నాయి.
కానీ ఈ సారి సిపిఐ , సిపీఎం పార్టీలు పొత్తు లేకుండా విడివిడిగానే ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు రాష్ట్రంలో నలుమూలలకు వ్యాపించాయి. ఒక వేళ సీపిఐ వైఎస్ఆర్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. సీపీఐ కి పెద్ద లాభం ఉండదు గానీ.. వైఎస్ ఆర్ పార్టీ కి మాత్రం తన ఉనికి చాటుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ వార్తలను సీపీఐ నారాయణ ఖండిస్తున్నారని తెలిసింది.
జగన్తో ఇప్పుడు గానీ.. భవిష్యత్తులో గానీ ఎన్నికల పొత్తు పెట్టుకునే ఆలోచనే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తండ్రి అవినీతి సంపదతో పాటు సీఎం పదవి కూడా వారసత్వంగా కావాలంటూ ఆయన ప్రారంభించిన పార్టీని అసలు పరిగణనలోకే తీసుకోబోమన్నారు. ఉప ఎన్నికల్లో పొత్తులు..పోటీపై పార్టీ మహాసభల్లో చర్చించాకే నిర్ణయిస్తామన్నారు. వివిధ సందర్భాల్లో తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు .అయితే . పొరపాటున కూడా ఆ మాట చెప్పలేదు. జగన్ రాజకీయ నేపథ్యమే.. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది. ఆయనతో ఎన్నికల సర్దుబాటు ఉంటుందని చెప్పలేదు.. భవిష్యత్తులో ఉంటుందనుకోవట్లేదు. వైఎస్ సీఎంగా ఉండి అవినీతిలో కూరుకుపోయారు. ఆయన వారసునిగా జగన్ రాజకీయాల్లోకి వచ్చాడు. సీఎం పదవీ నాకే కావాలి.. సంపదా నాకే కావాలంటూ వచ్చాడు. అవినీతి నేపథ్యంలో ప్రారంభించిన ఆ పార్టీని మేము పరిగణనలోకి తీసుకోవట్లేదు నారాయణ అంటున్నారు. ఏ పార్టీకైనా శాశ్వత శుత్రువులు, మిత్రులు ఉండరు. 2009 ఎన్నికల్లో కలిసి పనిచేశాం. అది వచ్చినప్పుడు దీనిపైన చర్చించి నిర్ణయిస్తాం.
పోలవరం టెండర్లలో సోనియాగాంధీ, సీఎం కిరణ్ జోక్యం చేసుకున్నారన్నారు. అవినీతిలో వైఎస్ ప్రభుత్వ తీరునే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. ఈ నెల 21 నుంచి జరిగే పార్టీ మహాసభలకు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్, ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి హాజరవుతురన్నారు. అరుణ పతాకాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కమలమ్మ ఆవిష్కరిస్తారని, సీపీఎం కార్యదర్శి రాఘవులు సందేశాన్ని ఇస్తారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more