బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటుడు పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా 'విరాటపర్వం'లోని దగ్గుబాటి రానా పాత్ర 'కామ్రేడ్ రవన్న'ను పరిచయం చేస్తూ, ఫస్ట్ గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం చిత్రయూనిట్ విడుదల చేసింది. లీడర్ చిత్రం నుంచి ప్రారంభమైన రానా సినీకెరీర్ లో తాజాగా నిర్మితమవుతున్న చిత్రం ఆయనను మాస్ ప్రేక్షకులకు చేరువ చేసేలా వుంది.
సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తుండగా, రానాతో పాటు సాయి పల్లవి, ప్రియమణి, నివేదితా పేతురాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ టీజర్ లో రానా నక్సల్స్ నేతగా కనిపిస్తున్నాడు. చేతిలో గన్ పట్టుకుని, తన సహచరులతో కలిసి నడుస్తుండటం, అడవుల దృశ్యాలు, వాటర్ ఫాల్స్, కొన్ని సీన్స్ జోడించారు. "ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది..." అంటూ ప్రారంభమయ్యే టీజర్ లో "సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.." అన్న లెటర్స్ కనిపిస్తున్నాయి. ఇక రవన్న పాత్ర నక్సల్ గా మారకముందు డాక్టర్ రవిశంకర్ అన్న విషయాన్ని కూడా రివీల్ చేశారు. టీజర్ చివర్లో "ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం, దొపిడి రాజ్యం" అని కూడా వినిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more
Dec 10 | కొణిదెల యువరాణి మెగా డాటర్ గా ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ ఒక్కటైంది. పండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య అంగరంగవైభవంగా ఉదయ్ పూర్ కోటలో మిరుమిట్లు... Read more