ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా ధియేటర్లలోకి తన తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’తో ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. నభానటేష్ కథానాయిక. ‘వినూత్నమైన పాయింట్ కు చక్కటి భావోద్వేగాలు, వినోదాన్ని జోడిస్తూ దర్శకుడు సుబ్బు అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించగా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నెల (డిసెంబర్) 25న చిత్రాన్ని విడుదల కానుంది
చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఇక మరో వారంలో చిత్రం విడుదల చేయనుండగా, తాజాగా ప్రోమో విడుదల చేశారు. ఇందులో శ్లోకాలు అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చిన మెగా హీరో థియేటర్ లో 108 శ్లోకాలతో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహా చిత్రంలో చెప్పిన మాస్ డైలాగ్ ను తిరగేసి తన శ్లోకంగా మార్చేసిన తేజ్.. చరిత్రలో సుఖపడని వారెవరో చాలా వివరాణాత్మకంగా చెప్పాడు. అంతేకాదు పెళ్లి చేసుకున్నవాడు నిత్యం తన భార్య చేతిలో ఫూల్ అవుతూనే వుంటాడని విభిన్నంగా సెలవిచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత థియేటర్లో సందడి చేయనున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా ప్రోమో చూసేద్దామా..!
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more
Dec 10 | కొణిదెల యువరాణి మెగా డాటర్ గా ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ ఒక్కటైంది. పండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య అంగరంగవైభవంగా ఉదయ్ పూర్ కోటలో మిరుమిట్లు... Read more