'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇప్పుడు ఆ చిత్రం నిజంగానే భయపెడుతోంది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా కథ సమకూర్చి, నిర్మించగా, అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ధియేటర్లు ప్రారంభమైన వేళ, మొట్టమొదట విడుదలైన తెలుగు సినిమా ఇదే కావడం.. అటు కరోనా భయాందోళన ఇటు చిత్రంపై పెద్దగా ఎలాంటి ప్రచారం కూడా జరగకపోవడంతో సినిమా ధీయేటర్లకు ప్రేక్షకులు అశించినంతగానే కాదు.. అరకోర కూడా రావడం లేదు.
దీంతో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా వున్నాయన్న అసక్తితో మీడియా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా ఈ సినిమా వసూళ్ళు అత్యంత ఘోరంగా నిలిచాయి. సినీ ప్రేక్షకులకు, థియేటర్ యాజమాన్యాలకు షాకిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున కేవలం రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకూ మాత్రమే కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ వసూళ్ల తాకిడి చూస్తే కనీసం సినిమా చిత్రీకరణ సమయంలో క్యాటరింగ్ ఖర్చులు కూడా వచ్చేలా వున్నాయా.? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తన చిత్రాలకు అనునిత్యం నెగిటివ్ పబ్లిసిటీతో టాక్ వచ్చేలా చూసుకునే వర్మ.. కరోనా వైరస్ చిత్రంలో మాత్రం పాజిటివ్ అప్రోచ్ తో వెళ్లి బోల్తాపడ్డాడు.
లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ ఇంట్లోని వారిని కరోనా వైరస్ ఎలా భయపెట్టిందన్న కథాంశంతో ఈ చిత్రం తయారైంది. ఈ సినిమా ప్రపంచంలోనే కరోనాపై తీసిన తొలి చిత్రమని వర్మ ఎంతగా ప్రచారం చేసుకున్నా, ఒక్కో థియేటర్ లో పదుల సంఖ్యలో కూడా ప్రేక్షకులు లేరని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక, ఈ నెల 25న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రొమాంటిక్ డ్రామా 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు రప్పిస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more
Dec 10 | కొణిదెల యువరాణి మెగా డాటర్ గా ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ ఒక్కటైంది. పండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య అంగరంగవైభవంగా ఉదయ్ పూర్ కోటలో మిరుమిట్లు... Read more