వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ కు భయపడి తమిళనాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు అందోళనలతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది, ఈ నేపథ్యంలో ఈ దారుణ ఘటనలపై రాష్ట్రంలోని రాజకీయ నేతల నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా స్పందించారు, వారి బాటలోనే సినీహీరోలు కూడా స్పందించారు. విద్యార్థుల ఆత్మహత్యల ఘటనతో తన గుండె పగిలిందని ఆయన ట్వీట్ చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబసభ్యులు పడుతున్న బాధను ఊహిస్తేనే భయంగా వుందని పేర్కోన్నారు, విద్యావ్యవస్థ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసిన హీరో సూర్య.. ప్రజలంతా నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఉత్పన్నమైందని అన్నారు. నీట్ భయంతో ఒక్క రోజు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని, ఇలాంటి వార్తలు తనతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా ఎంతగానో కలిచివేశాయని తెలిపారు. ఏదైనా పరీక్షలకు ముందు విద్యార్థులకు తమ సహచరులు శుభాకాంక్షలు చెబుతారని, కానీ ప్రస్తుతం నీట్ పరీక్షల ప్రక్రియలో విద్యార్థులకు ఓదార్పు మాటలు చెప్పి పరీక్షలు రాయించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతోందని ఇది చాలా దారుణమని ఆయన అన్నారు.
విద్యార్థులకు పరీక్ష ముందు ధైర్యం నూరిపోయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. నీట్ పరీక్షలతో పేద విద్యార్థులను డాక్టర్లు కావాలన్న కోరికను చంపేసిందని సూర్య మండిపడ్డారు. దీంతో ఆయనకు మద్దతుగా నెట్ జనులు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో విద్యార్థుల ఆత్మహత్యలను తీవ్రంగా ఖండిస్తూ నటుడు కమల్ హాసన్, మాధవన్ లు కూడా పోస్టులు పెట్టారు. ఇక హీరో సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం.. ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more