టాలీవుడ్ లోనూ డ్రగ్స్ మాఫియా రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకుని పలువురు సెలబ్రిటీలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు కూడా. అయితే వాళ్ల పేర్లు బయటకు వస్తాయా? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న టైంలో మా పెద్దలు హడావుడిగా ప్రెస్ మీట్ నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, రచయిత పరుచూరి వెంకటేశ్వర్లు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.
తెలంగాణలో డ్రగ్స్ రాకాసిని అంతమొందించేందుకు పోలీసులు అద్భుతంగా చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా అల్లు అరవింద్ ప్రశంసించాడు. 'సినీ పరిశ్రమలో 15 మంది నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. వారికి నేను చెప్పేది ఏంటంటే... మీరు అచ్చం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్టు వ్యవహరిస్తున్నారు. మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఎవరికీ తెలియదనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. మీకు సంబంధించిన ప్రతి అంశం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంది. ఎప్పుడు? ఎక్కడ? ఎవరి వద్ద? ఎలా? డ్రగ్స్ తీసుకున్నారన్న ప్రతి రికార్డు వారి వద్ద వుంది" అని తెలిపాడు. అయితే కేవలం మీ భవిష్యత్ నాశనం చేయకూడదన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని పోలీసులు ఉపేక్షిస్తున్నారు అని ఆయన తెలిపాడు.
పూర్తి వీడియో కోసం క్లిక్ చేయండి
ఇప్పటికి అయిందేదో అయిపోయిందని, ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన సూచించాడు. సినీ పరిశ్రమలో ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉండాలని, అలా కాకుండా సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెచ్చి, సమాజానికి కీడుగా మారితే తీవ్రంగా నష్టపోయేది మీరేనని సూచించాడు. ముంబైలో రేవ్ పార్టీ కల్చర్ ఇక్కడికి పాకిపోయిందని, అక్కడ కొంత మంది చేసే పనులను మేము ఇక్కడా చేస్తామంటారా? అయితే ఇండస్ట్రీ నుంచి తప్పుకోండంటూ ఘాటుగా హెచ్చరించాడు. ఇక మాదక ద్రవ్యాలతో జీవితాలను పాడుచేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన యువతకు పిలుపునిచ్చాడు. ఇక మరో నిర్మాత సురేష్ బాబు డ్రగ్స్ కి వ్యతిరేకంగా డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీలను నిర్వహిస్తామని పేర్కొన్నాడు.
అందుకే రియాక్ట్ అయ్యారా?
గతంలో టాలీవుడ్ డ్రగ్ లింకులు అనేకం బయటపడ్డాయి. అయితే ఆ టైంలో స్పందించని మా ఇప్పుడెందుకు రియాక్ట్ అయ్యిందన్న విషయాన్ని విశ్లేషిస్తే... డ్రగ్స్ డొంక పెద్ద స్థాయిలోనే కదలటంతోనే వాళ్లు ఇలా ప్రెస్ మీట్ పెట్టినట్లు స్పష్టమౌతోంది. ఇప్పటికే 3 యువహీరోలు, 4 దర్శకులు, 2 నిర్మాతలుసహా ఓ ఫైట్ మాస్టర్ కు ఎక్సైజ్ సిట్ నోటీసులు అందజేసింది. ఆరురోజుల్లో విచారణకు హాజరుకాకుంటే కఠిన చర్యలు ఉంటాయని అందులో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ అంతా అలాంటి వాళ్లేనన్న భావనను తొలగించేందుకే ఇప్పుడు ఇలా మీడియా సమావేశం నిర్వహించిందని అర్థమౌతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more