వైజయంతీ మూవీస్ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. చిరు తనయుడు చరణ్ ని తెరంగేట్రం చేయించింది కూడా ఈ సంస్థే. తాజాగా మరోమారు రామ్ చరణ్ - అశ్వని దత్ కాంబోలో మరో చిత్రం రాబోతుందని తెలుస్తోంది. దీనికి దర్శకుడు బోయపాటి శ్రీను.
భద్ర, తులసి, సింహా తర్వాత అంతటి భారీ విజయం కోసం తపిస్తున్న శ్రీను ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాలని ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ రెడీ అయింది. దానికి కొన్ని తుదిమెరుగులు దిద్దాలని రామ్చరణ్ సూచించటంతో బోయపాటి ఆపనిలో నిమగ్నమైనట్టు వినికిడి.
ప్రస్తుతం రామ్చరణ్ షెడ్యూల్ బిజీగా వుండడంతో ప్రస్తుత ప్రాజక్టులు పూర్తయిన తర్వాతే చరణ్ ఈ మూవీ చేసే అవకాశం ఉంది. జనవరి 2 నుంచి వంశీ చిత్రం 'ఎవడు'లో చేయబోతున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్లో జంజీర్ ప్రోగ్రెస్ లో ఉన్న సంగతి తెలిసిందే..
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more