కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత ఏడాది కేఫ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వీజి సిర్థార్థ.. నదిపై వున్న వంతెన వద్ద కారు నిలిపి తన డ్రైవరును వెనక్కు పంపించి.. ఆకస్మాత్తుగా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన ఆత్మహత్యకు తాను తీసుకున్న రుణాలే కారణమని.. ఆర్థికంగా కొంత ఒత్తిడిలో వున్న ఆయనను.. అప్పులు చెల్లించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక ఆయన నదిలో దూకి మరణించాడని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
కాగా, ఈ కేప్ కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ సంస్థలో తాను ఒక డైరెక్టర్ గా వున్నా.. తన భర్త చూసుకుంటున్న నేపథ్యంలో పెద్దగా పట్టించుకోని ఆయన సతీమణి మాళవిక హెగ్డే.. తాజాగా కాఫీ డే సంస్థ నూతన సీఈవో పగ్గాలను అందుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్చేంజీ ఫైలింగ్లో వెల్లడించింది. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె అయిన మాళవిక.. అప్పుల్లో ఉన్న కాఫీడే సంస్థను తిరిగి నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు గతంలో చెప్పారు. సీఈవోతో పాటు అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవీ, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్రను సంస్థ బోర్డు నియమించింది.
నూతన సీఈవో (కార్య నిర్వాహక అధికారి)తో పాటుగా అదనపు డైరెక్టర్లు అందరూ 2025 వరకు ఆయా పదవుల్లో కొనసాగుతారని బోర్డు వెల్లడించింది. కాఫీడే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ మరణించిన తర్వాత కాఫీ డే సంస్థకు ఇండిపెండెంట్ బోర్డు సభ్యుడైన ఎస్వీ రంగనాథ్ మధ్యంతర ఛైర్మన్గా వ్యవహరించారు. బెంగళూరుకు చెందిన కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా వందలాది కాఫీ షాప్లను నిర్వహిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more
Jul 15 | రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త టెక్నాలజీలను తీసుకొస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. జియో ప్లాట్ ఫామ్స్ లో భాగంగా జియో గ్లాస్, జియో టీవీ ప్లస్, జియో మార్ట్ లను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్... Read more