చైనా మొబైల్ మేకర్ షియోమి రెడ్ ఎంఐ 5 ఎకు ధీటుగా స్వదేశీ మొబైల్ మేకర్ మైక్రోమాక్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టింది. భారీ బ్యాటరీతో బడ్జెట్ దరలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ కు భారత్ 5 అని నామకరణం చేసింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంఛ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేవలం రూ.5555 ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ లాంచ్ లో వొడాఫోన్ తో భాగస్వామ్యంలో డేటాను కూడా ఆఫర్ చేస్తుంది.
ఈ ఆఫర్ ప్రకారం ఐదు మాసాల పాటు నెలకు 10 జీబి డాటాను కూడా అందించనుంది. భారత్-సీరీస్లో భారత్ 5 ప్లస్, భారత్ 5 ప్రోతో పాటు మరో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి 2018 నాటికి 6 లక్షల యూనిట్లను విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఫోన్లు దేశంలోని ఆఫ్ లైన్ రిటైలర్లు ద్వారా మాత్రమే అందుబాటులో వుండనున్నాయి. దీంతో రీటైల్ మార్కెట్లోనే కొనుగోలు చేయాల్సి వుంటుంది.
మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్, చీఫ్ మార్కెటింగ్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ షుబోడిప్ పాల్ మాట్లాడుతూ .. భారత్5 సిరీస్ స్మార్ట్ఫోన్లు స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో తరువాత దిశగా భారత్ ను తీసుకెళతాయని అశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యుత్తు అంతరాయ సమస్యలను ఎదుర్కొంటున్న 3-4 టైర్ నగరాల్లో తమ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ డివైస్లు కీలకంగా నిలుస్తాయన్నారు. అయా నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో తమ నూతన ఉత్పాదనకు అదరణ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మైక్రోమ్యాక్స్ భారత్ 5 స్పెసిఫికేషన్లు:-
5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్
1.3GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ నౌగాట్
720x1280 పిక్సల్స్ రిజల్యూషన్
1జీబీ ర్యామ్
16జీబీ స్టోరేజ్
16జీబీదాకా విస్తరించుకునే సదుపాయం
5 మెగాపిక్సెల్ బ్యాంక్ అండ్ ఫ్రంట్ కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more