నష్టాలకు బ్రేకులు.. తటస్థంగా ముగిసిన మార్కెట్లు Sensex, Nifty end volatile session in red

Sensex nifty lose momentum intra day gains wiped off

Rs500 Notes, Rs1000 Notes, BSE, NSE, Black Money, Indian Stocks, Sensex, sensex bse, sensex today, sensex today india, sensex today closing, sensex share price, sensex shares, sensex gainer and losers, sensex graph, nifty, nifty top gainers, nifty top 50, bse sensex, bse nse, global markets, Asian markets, BSE, NSE

Spurt in late trade selling dragged market at closing. After a volatile day, the market ended in red. The Sensex ended down 5.94 points at 26298.69 and the Nifty was up 3.15 points at 8111.60.

నష్టాలకు బ్రేకులు.. తటస్థంగా ముగిసిన మార్కెట్లు

Posted: 11/16/2016 04:30 PM IST
Sensex nifty lose momentum intra day gains wiped off

దేశీయ స్టాక్ మార్కెట్లలలో వరుసగా గత మూడు రోజులుగా తిష్టవేసిన నష్టాలకు ఇవాళ బ్రేకులు పడ్డాయి. కానీ సూచీలు మాత్రం ఇవాళ తటస్థంగానే ముగిసాయి. అవినీతి, నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్స్ గా పేర్కొంటూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు ప్రభావం ఇంకా మార్కెట్లను వీడలేదు. దీంతో ఇవాళ నష్టాలకు బ్రేకులు పడినా.. మార్కెట్లు మాత్రం లాభాలను చవిచూడలేకపోయింది.

ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాలలో దూసుకెళ్లిన మార్కెట్లు ఆ తరువాత తిరోగమనం బాటపట్టాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 300 పాయింట్లకు పైగా ర్యాలీ జరిపింది. నిఫ్టీ సైతం 8200 స్థాయిని పునరుద్ధరించుకుని ట్రేడ్ అయింది. అయితే అందివచ్చిన లాభాలను అధిమిపట్టుకోవడంలో విఫలమైన మార్కెట్లు చివరకు తటస్థంగా ముగిసాయి. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 6 పాయింట్లు నష్టంతో 26 వేల 299 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 8వేల 112 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8100 మార్కుకు ఎగువకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో అటో రంగం ర్యాలీని కొనసాగించగడం.. ఐటీ, టెక్నాలజీ రంగాలు కూడా మార్కెట్లు తటస్థంగా నిలిచేందుకు దోహదపడ్డాయి. అటు చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమ సూచీలు కూడా లాభాలను అందుకున్నాయి. అయితే బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ.. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, అయిల్ అండ్ గ్యాస్ రంగ సూచీలు తీవ్ర నష్టాలను అందుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మధ్య తరహా నిఫ్టీ రంగానికి చెందిన సూచీలు నెలచూపులు చూశాయి. ఈ క్రమంలో ఏషియన్ పెయింట్స్, జీ ఎంటర్టైన్మెంట్, ఏషియర్ మోటార్స్, టీసీఎస్, మారుతి సుజుకీ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, అంబుజా సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిండాల్కో, ఐటీసీ, అరబిందో ఫార్మ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs500 Notes  Rs1000 Notes  sensex  nifty  nse  bse  stock market  global markets  business  

Other Articles