దేశీయ స్టాక్ మార్కెట్లలలో వరుసగా గత మూడు రోజులుగా తిష్టవేసిన నష్టాలకు ఇవాళ బ్రేకులు పడ్డాయి. కానీ సూచీలు మాత్రం ఇవాళ తటస్థంగానే ముగిసాయి. అవినీతి, నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్స్ గా పేర్కొంటూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు ప్రభావం ఇంకా మార్కెట్లను వీడలేదు. దీంతో ఇవాళ నష్టాలకు బ్రేకులు పడినా.. మార్కెట్లు మాత్రం లాభాలను చవిచూడలేకపోయింది.
ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాలలో దూసుకెళ్లిన మార్కెట్లు ఆ తరువాత తిరోగమనం బాటపట్టాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 300 పాయింట్లకు పైగా ర్యాలీ జరిపింది. నిఫ్టీ సైతం 8200 స్థాయిని పునరుద్ధరించుకుని ట్రేడ్ అయింది. అయితే అందివచ్చిన లాభాలను అధిమిపట్టుకోవడంలో విఫలమైన మార్కెట్లు చివరకు తటస్థంగా ముగిసాయి. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 6 పాయింట్లు నష్టంతో 26 వేల 299 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 8వేల 112 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8100 మార్కుకు ఎగువకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో అటో రంగం ర్యాలీని కొనసాగించగడం.. ఐటీ, టెక్నాలజీ రంగాలు కూడా మార్కెట్లు తటస్థంగా నిలిచేందుకు దోహదపడ్డాయి. అటు చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమ సూచీలు కూడా లాభాలను అందుకున్నాయి. అయితే బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ.. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, అయిల్ అండ్ గ్యాస్ రంగ సూచీలు తీవ్ర నష్టాలను అందుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మధ్య తరహా నిఫ్టీ రంగానికి చెందిన సూచీలు నెలచూపులు చూశాయి. ఈ క్రమంలో ఏషియన్ పెయింట్స్, జీ ఎంటర్టైన్మెంట్, ఏషియర్ మోటార్స్, టీసీఎస్, మారుతి సుజుకీ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, అంబుజా సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిండాల్కో, ఐటీసీ, అరబిందో ఫార్మ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more