Sensex closes 88 points lower, Nifty below 8,650 on WPI data

Sensex nifty close down cipla adani ports jump 7

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

The S&P BSE Sensex closes 0.31%, or 87.79 points, lower at 28,064.61, while the Nifty 50 closes 0.34%, or 29.60 points, lower at 8,642.55

రెండేళ్ల గరిష్టస్థాయికి ద్రవ్యోల్భణం.. నష్టాల్లో దేశీయ సూచీలు..

Posted: 08/16/2016 07:03 PM IST
Sensex nifty close down cipla adani ports jump 7

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మూటగట్టుకున్నాయి. టోకు దరల సూచీ గణంకాలను ప్రభుత్వం వెలువరించడం దాని ప్రభావం వల్ల దేశీయ సూచీలపైబడి నష్టాలలో ముగిశాయి. మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాలను అర్జించాయి. జూలై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ)  అంచనాలకు మించి ఎగబాకింది. జూన్ నెలతో పోలిస్తే దాదాపు రెట్టింపు శాతం నమోదైంది.   1.62 శాతం నుంచి 3.55 శాతానికి పెరగడం మార్కెట్ల వర్గాలను విస్మయ పర్చింది.  ఆహార ధరలు 3.55 శాతంతో  దాదాపు 23 నెలల గరిష్టానికి తాకింది. దీని ప్రభావం సూచీలపై స్పష్టంగా కనింపించింది,

దీంతో అమెరికా మూడు మేజర్ స్టాక్ సూచీలు డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 రికార్డు స్థాయిలో క్లోజ్ అయినట్టు బైస్పోక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు వెల్లడించింది. వీటి ప్రభావంతో ఐఐపీ డాటా విడుదలకు ముందుకు కూడా మార్కెట్లు లాభాలలో పయనించాయి. ఫలితంగా మార్కెట్లు ముగింపు సమయానికి సెన్సెక్స్ 88 పాయింట్లు నష్టాలతో 28 వేల 064 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ 30 పాయింట్లు నష్టంతో 8,643 పాయింట్ల వద్దకు దిగజారింది. ఇవాళ మొత్తంగా 2895 సంస్థల షేర్లు ట్రేడింగ్ లో పాల్గోనగా వాటిలో 1618 సంస్థల షేర్లు నష్టాల బాటలో పయనించగా, 1108 సంస్థల షేర్లు లాభాలను గడించాయి. కాగా 169 సంస్థల షేర్లు తటస్థంగా నిలిచాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ రమారమి అన్ని సూచీలు లభాల బాటలోనే పయనించగా, అటో, ఐటీ టెక్నాలజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంజీసీ, చిన్న తరహా పరిశ్రమల సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. మెటల్స్, క్యాపిటల్ గూడ్స్, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు అధిక లాభాలను అర్జించగా, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మధ్య తరహా పరిశ్రమల సూచీలు లాభాలను అర్జించాయి. ఈ నేపథ్యంలో  సిప్లా, అదాని పోర్ట్స్, హిండాల్కో, బిపిసీఎల్; అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో పయనించగా, భారతి ఇన్ ఫ్రాటెల్, హెచ్ సి ఎల్ టెక్, సన్ ఫార్మా, బాస్చ్, టెక్ మహీంద్రా తదితర కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles