దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మూటగట్టుకున్నాయి. టోకు దరల సూచీ గణంకాలను ప్రభుత్వం వెలువరించడం దాని ప్రభావం వల్ల దేశీయ సూచీలపైబడి నష్టాలలో ముగిశాయి. మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాలను అర్జించాయి. జూలై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) అంచనాలకు మించి ఎగబాకింది. జూన్ నెలతో పోలిస్తే దాదాపు రెట్టింపు శాతం నమోదైంది. 1.62 శాతం నుంచి 3.55 శాతానికి పెరగడం మార్కెట్ల వర్గాలను విస్మయ పర్చింది. ఆహార ధరలు 3.55 శాతంతో దాదాపు 23 నెలల గరిష్టానికి తాకింది. దీని ప్రభావం సూచీలపై స్పష్టంగా కనింపించింది,
దీంతో అమెరికా మూడు మేజర్ స్టాక్ సూచీలు డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 రికార్డు స్థాయిలో క్లోజ్ అయినట్టు బైస్పోక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు వెల్లడించింది. వీటి ప్రభావంతో ఐఐపీ డాటా విడుదలకు ముందుకు కూడా మార్కెట్లు లాభాలలో పయనించాయి. ఫలితంగా మార్కెట్లు ముగింపు సమయానికి సెన్సెక్స్ 88 పాయింట్లు నష్టాలతో 28 వేల 064 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ 30 పాయింట్లు నష్టంతో 8,643 పాయింట్ల వద్దకు దిగజారింది. ఇవాళ మొత్తంగా 2895 సంస్థల షేర్లు ట్రేడింగ్ లో పాల్గోనగా వాటిలో 1618 సంస్థల షేర్లు నష్టాల బాటలో పయనించగా, 1108 సంస్థల షేర్లు లాభాలను గడించాయి. కాగా 169 సంస్థల షేర్లు తటస్థంగా నిలిచాయి.
ఇవాళ్లి ట్రేడింగ్ రమారమి అన్ని సూచీలు లభాల బాటలోనే పయనించగా, అటో, ఐటీ టెక్నాలజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంజీసీ, చిన్న తరహా పరిశ్రమల సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. మెటల్స్, క్యాపిటల్ గూడ్స్, అయిల్ అండ్ గ్యాస్ సూచీలు అధిక లాభాలను అర్జించగా, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ, హెల్త్ కేర్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మధ్య తరహా పరిశ్రమల సూచీలు లాభాలను అర్జించాయి. ఈ నేపథ్యంలో సిప్లా, అదాని పోర్ట్స్, హిండాల్కో, బిపిసీఎల్; అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీల షేర్లు లాభాల్లో పయనించగా, భారతి ఇన్ ఫ్రాటెల్, హెచ్ సి ఎల్ టెక్, సన్ ఫార్మా, బాస్చ్, టెక్ మహీంద్రా తదితర కంపెనీల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more