ప్రఖ్యాత మొబైల్ కంపెనీ శామ్సంగ్ భారత్ మార్కెట్లో తన కొత్త మోడళ్లైన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్లను లాంచ్ చేసింది. తన ఫ్లాగ్షిప్ మోడళ్లయిన ఈ రెండు ఫోన్లను ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో లాంఛనంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్లో గెలాక్సీ ఎస్7 (32 జీబీ) రూ. 48,900, ఎస్7 ఎడ్జ్ (32 జీబీ) రూ. 56,900లకు లభించనున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్లను ప్రతిష్టాత్మక ఫీచర్లతో అందిస్తున్నట్టు కంపెనీ చెపుతోంది. ఈ కొత్త మోడళ్ల డిస్ప్లే ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంటుందని, అలాగే తొలిసారి ఈ మొబైళ్లలో డుయల్ పిక్సల్ కెమెరాను వాడినట్టు శామ్సంగ్ తెలిపింది. గెలాక్సీ ఎస్7 త్రీడీ గ్లాస్ మెటల్ బాడీతో వస్తుంది. దీనిలో 5.1 క్యూహెచ్డీ డిస్ప్లే ఉంటుంది. ఇక ఎస్7 ఎడ్జ్ లో 5.5 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్లలోనూ 12 మెగా పిక్సల్ డుయల్ రియర్ లెన్స్ ఉంటాయి.
ఈ తాజా మోడళ్ల స్పెషాలిటీ ఏమిటంటే వీటి మెమరీ స్టోరేజీని బాగా ఎక్స్పాండ్ చేసుకునే వీలుండటం. ఈ రెండు ఫోన్లలోనూ మైక్రో ఎస్డీ కార్డ్ మెమరీ 200 జీబీ వరకు పెంచుకోవచ్చు. కొన్ని దేశాల్లో ఈ మెమరీ ట్రేను డ్యూయల్ సిమ్గా కూడా వాడుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. అలాగా ఈ రెండు కొత్త ఫోన్ల ర్యామ్ సామర్థ్యాన్ని 3జీబీ నుంచి 4 జీబీకి పెంచింది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ అయిన ఈ రెండు ఫోన్లలో గెలాక్సీ ఎస్-7 బ్యాటరీ సామర్థ్యం 3000ఎంఏఎహ్ కాగా, ఎస్7 ఎడ్జ్ బ్యాటరీ పవర్ 3600ఎంఏహెచ్. బ్లాక్ షప్పైర్, గోల్డ్ ప్లాటినమ్, సిల్వర్ టైటానియం రంగుల్లో మూడు వేరియంట్లలో లభించే ఈ ఫోన్లు ఈ నెల 18 నుంచి మార్కెట్లో అమ్మనున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more