నూతన సంవత్సరంలో సరికోత్త జోష్ తో వున్న మదుపరులు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వడ్డీ రేట్లను సవరిస్తుందన్న వార్తల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలను ఆర్జించాయి. వరుసగా ఆరు రోజుల పాటు లాభాలను ఆర్జించిన సెన్సెక్స్ ఇవాళ 380 పాయింట్లను ఆర్జించింది. దీంతో నాలుగు వారాల గరిష్టస్థాయికి సెన్పెక్స్ చేరుకుంది. బ్యాంకింగ్ రంగంలో సవరణలతో సంబంధిత సంస్థల షేర్లు ర్యాలీని కోనసాగించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో లాభాలను ఆర్జించాయి.
దీనికి తోడు విదేశీ ష్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో సూచీలు 380 పాయింట్లకు పైగా లాభాన్ని గడించాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడి 27, 937 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు ఎగసి 8,400 మార్కును తాకి 8, 396 పాయింట్ల వద్దకు చేరుకుంది. ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ యూనిట్ సహా ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల షేర్లు కొనుగోళ్లకు మదుపరులు వెంటపడ్డారు.
బ్యాంకింగ్ రంగ షేర్లతో పాటు కాపిటల్ గూడ్స్, ఐటీ, పవర్; టక్నాలజీ, రియాల్టీ రంగ షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం పలు ఆర్థిక సంస్కరణనలను ప్రవేశపెట్టనుందన్న వార్త కూడా ర్యాలీ కొనసాగింపుకు దోహదపడింది. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ, ఆసియన్ పెయింట్స్, జిందాల్ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు లాభాల బాటలో సాగాయి. బీపీసీఎల్, ఎంఅండ్ఎం, ఎన్ఎండీసీ, హెచ్యూఎల్, రిలయన్స్ తదితర సంస్థలు నష్టాలు ఎదుర్కొన్నాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more