కేజీ బేసిన్ గ్యాస్ ధర పెంపు కోసం ప్రయత్నిస్తున్న రిలయన్స్ తన పంతాన్ని నెగ్గించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజీ బేసిన్లో ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరను పెంచాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డిమాండ్కు వ్యతిరేకంగా తయారు చేసిన నోట్ను వెనక్కి తీసుకోవాలని చమురు మంత్రిత్వ శాఖ హఠాత్తుగా నిర్ణయించింది. . కేజీ గ్యాస్ ధర పెంపుకోసం రిలయన్స్ గట్టిగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అక్టోబర్ మొదటి వారంలో చమురు మంత్రిత్వ శాఖ ఒక నోట్ను తయారు చేసి సాధికార మంత్రుల బృందంలోని సభ్యులకు సర్క్యులేట్ చేసింది. వాస్తవానికి తొలుత కుదిరిన ఒప్పందం ప్రకారం, కేజీ బేసిన్ గ్యాస్ ధరను 2014 ఏప్రిల్లో మాత్రమే సమీక్షించాల్సి ఉంది. అయితే ఈ లోపే ధరను అంతర్జాతీయ ధరలకు దీటుగా పెంచాలని రిలయన్స్ ప్రభుత్వంపై లోపాయకారిగా ఒత్తిడి తెస్తోంది.
జైపాల్రెడ్డి చమురు శాఖ మంత్రిగా ఉన్నంత కాలం ఈ ప్రతిపాదనలను గట్టిగా ప్రతిఘటించారు. ఈ శాఖనుంచి ఆయన్ను పక్కకు తప్పించి వీరప్ప మొయిలీకి పగ్గాలు అప్పగించిన తర్వాత, చమురు శాఖలో పావు లు రిలయన్ప్కు అనుకూలంగా కదులుతున్నట్టుగా వార్తలు వస్తున్నా యి. తాజాగా గ్యాస్ ధ ర పెంపు ప్రతిపాదనల కు వ్యతిరేకంగా సర్క్యులేట్ చేసిన నోట్ను ఉపసంహరించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా నియమించిన రంగరాజన్ కమిటీ కేజీ బేసిన్ గ్యాస్ ధరకు సంబంధించిన అంశాలనే పరిశీలిస్తున్నందున, నోట్ ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్టుగా చమురు మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నప్పటికీ ఈ వ్యవహారం సందేహాలకు తావిచ్చేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధర నిర్ణయానికి విధివిధానాలు, మార్గదర్శకాలను సూచించడంతో పాటు, భవిష్యత్తులో చమురు, సహజవాయువు అన్వేషణ కాంట్రాక్టులు ఎలా ఉండాలన్న విషయంపై కూడా రంగరాజన్ కమిటీ సిఫారసులు చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more