విదేశాల్లో దాచిన నల్ల డబ్బును తిరిగి భారత్కు తీసుకు రావాల్సిందే. నల్ల కుబేరుల పేర్లను వెల్లడించాల్సిందే' - వివిధ రాజకీయ పార్టీలతోపాటు అన్నా హజారే, బాబా రాందేవ్ వంటి ఉద్యమకారుల డిమాండ్ ఇది. 'విదేశాల్లో నల్ల డబ్బు దాచిన వారి పేర్లను వెల్లడించడం సాధ్యం కాదు. ఆ డబ్బును తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్నాం'- ఇది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న జవాబు. అయితే, ఆ అతి రహస్యం ఇక బట్టబయలు కానుంది. జర్మనీతో ఇటీవల స్విట్జర్లాండ్ కుదుర్చుకున్న ఒప్పందమే దీనికి నిదర్శనం.
జర్మనీతో టాక్స్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి స్విట్జర్లాండ్ పార్లమెంటు ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం లెక్కల్లోకి రాని డబ్బునకు సంబంధించి జర్మనీ ఆదాయ పన్ను అధికారులకు స్విస్ బ్యాంకులు గుర్తు తెలియని ఖాతాల ద్వారా అడ్వాన్స్ చెల్లింపులు చేస్తాయి. జర్మనీతోపాటు ఆస్ట్రియాలతోనూ స్విట్జర్లాండ్ ఇదే విధమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇటలీతో ఒప్పందం చర్చల్లో ఉంది. వాస్తవానికి, జర్మన్లకు సంబంధించిన 291.8 బిలియన్ డాలర్లు మన రూపాయల్లో సుమారు 15 లక్షల కోట్లు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతోంది. ఇందులో 60 శాతం పన్ను ఎగ్గొట్టినదే. ఈ నేపథ్యంలో, స్విట్జర్లాండ్లో వారు డబ్బు దాచిన రోజు నుంచి 21 నుంచి 41 శాతం పన్ను విధించాలని జర్మనీ చట్టసభ ప్రతినిధులు ప్రతిపాదిస్తున్నారు.
ఈ ఒప్పందానికి జర్మనీ పార్లమెంటు కూడా ఆమోద ముద్ర వేస్తే ఆ దేశానికి పెద్దఎత్తున పన్ను ఆదాయం సమకూరనుంది. విచిత్రం ఏమిటంటే.. ఈ ఒప్పందానికి ఇటు జర్మనీలోనూ అటు స్విట్జర్లాండ్లోనూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో దాచిన డబ్బు 7 ట్రిలియన్ డాలర్లు మన రూపాయల్లో చెప్పాలంటే సుమారు 3.5 కోట్ల కోట్లు! ఇందులో మూడో వంతు ఒక్క స్విట్జర్లాండ్లోనే ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more