దేశంలో శ్రీ వీరాంజనేయస్వామి కొలువై వున్న పుణ్యక్షేత్రాల్లో గండిక్షేత్రం ఒకటి. కడప జిల్లాలోని రాయచోటి-వేంపల్లి మార్గమధ్యంలో వున్న పాపఘ్ని నదీతీరంలో ఈ క్షేత్రం వెలిసింది. పాపఘ్ని నది ఇక్కడి శేషాచలం కొండను చీలుస్తుంది కాబట్టి.. ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వం.. సీత జాడను కనుగొనడంతోపాటు రావణాసురినిపై విజయానికి కారణమైన ఆంజనేయుని విగ్రహాన్ని రాముడు తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రీకరించాడు. ఆ చిత్రరూపమే విరాంజనేయుని విగ్రహంగా విరాజిల్లుతోంది.
స్థలపురాణం :
త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. అప్పుడు రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుండి గండిక్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో.. వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. అక్కడికి విచ్చే రామలక్ష్మణులను ఈ వాయుదేవుడు చూసి.. వారికి ఆహ్వానం పలికాడు. తన ఆతిథ్యం స్వీకరించమని వారిని వేడుకున్నాడు. అయితే.. రావణవధ అనంతరం తిరుగుప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాయుదేవుడికి శ్రీరాముడు వాగ్దానం చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక రావణుని చంపిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్న సమయంలో.. ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండుకొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి ఘనస్వాగతం పలికాడు. వాయుదేవునికి ఇచ్చిన మాట ప్రకారం.. శ్రీరాముడు ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన శ్రీరాముడు... సీతాన్వేషణం మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూలకారణమైన వీరాంజనేయుని విగ్రహాన్ని అక్కడున్న కొండశిల మీద తన బాణపు కొసతో చిత్రించాడు. ఆ చిత్రం చివరిదశలో వుండగా.. అప్పుడే లక్ష్మణుడు అక్కడికి చేరుకుని, కాలహరణం సంగతి గుర్తుచేస్తాడు. ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిటికెనవ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు. ఆ చిత్రరూపమే శ్రీ వీరాంజనేయుని విగ్రముగా ప్రస్తుతం విరాజిల్లుతోంది.
మరిన్ని విశేషాలు :
* ‘త్రేతాయుగం’ తర్వాత వసంతాచార్యులు అనే భక్తుడు గండిక్షేత్రంలో ఓ చిన్నగుడి నిర్మించి.. ఆ రేఖాచిత్రానికి పూజలు చేయడం ప్రారంభించాడు. మరికొంతకాలానికి వ్యాసరాయలనే శిల్పాచార్యుడు.. ఆ రేఖా చిత్రాన్ని విగ్రహంగా మార్చాలని నిశ్చయించుకుని తన దగ్గరున్న ఉలితో చెక్కుతుండగా.. వీరాంజనేయస్వామివారి ఎడామచేతి చిటికెనవ్రేలు విడదీసే సందర్భంలో రక్తం ధారలుగా స్రవించిందట. అది గమనించిన శిల్పాచార్యుడు.. తన ప్రయత్నాన్ని విరమించుకుని.. పునఃప్రతిష్ట చేయడం జరిగింది.
* 2007 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు గండిక్షేత్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. వీరాంజనేయ స్వామివారి ఆలయానికి ప్రహారీ నిర్మించి, ఉత్తరంవైపు గాలిగోపురం, కల్యాణ మండపం, అన్నదాన సత్రం మొదలైన భవనాలు నిర్మించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more