నిత్య కల్యాణ పెరుమాళ్ దేవాలయం (తిరువిడందై).. భారతదేశంలో వున్న 108 వైష్ణవ క్షేత్రాలలో 62వ వరాహ క్షేత్రం ఇది! ఇది చెన్నపట్నంలోని తిరువాన్మియూరుకి దక్షిణంగా 19 కి. మి. దూరంలో, చెన్నపట్నం నుండి పుదుచ్చేరి వెళ్ళు తూర్పు తీర మార్గంపై కోవళం బస్సు స్టేషను నుండి 3 కి. మి దూరములో కలదు. ఈ ఆలయానికి ‘నిత్యకల్యాణ్ పెరుమాళ్’ అని పేరు ఎలా ఏర్పడిందన్న విషయంపై ఓ పురాణగాధ అమలులో వుంది. అదేమిటంటే..
స్థలపురాణం :
పూర్వం గవళ మహర్షికి 360 మంది కుమార్తెలు వుండేవారు. ఒకేసారి అంతమంది కుమార్తెలు ఆయన పుట్టడంతో.. వారి వివాహము ఎలా చేయాలోనన్న ఆందోళనలో మునిగిపోయారు. అయితే.. ఎలాగోలా వారి వివాహం చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహర్షి వారి వివాహం నిశ్చయించడం కోసం విష్ణుమూర్తిని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఆ మహర్షి ముందు ప్రత్యక్షమై.. ఏమీ చింతించవద్దని భరోసా ఇస్తారు. తానే ఆ 360 మంది కన్యలను వివాహం చేసుకుంటానని శ్రీ మహావిష్ణువు ఆ మహర్షికి వరం ప్రసాదిస్తాడు. దీంతో అతడు సంతోషించి అందుకు వెంటనే సరేనని అంటాడు.
అప్పుడు విష్ణువు ఆ కన్యలను రోజుకొకరిని చొప్పున సంవత్సరకాలం వరకు వారిని వివాహం చేసుకుంటాడు. అలా ఏడాదిపాటు 360 కన్యలను విష్ణువు వివాహం చేసుకున్నాడు కాబట్టే.. ఆయనకు ‘నిత్య కల్యాణ పెరమాళ్’ అను పేరు వచ్చెను. ఆ 360 మంది కన్యలను వివాహం చేసుకున్న తర్వాత విష్ణువు వారందరిని ఒక్కరిగా మార్చేస్తాడు. అలా మార్చడం వల్లే అమ్మవారికి ‘అఖిలవల్లి’ అను పేరు వచ్చింది. ఆ అమ్మవారిని శ్రీ విష్ణువు తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి.. ఆ ప్రదేశానికి ‘తిరువిడందై’ అను పేరు వచ్చింది.
ఆలయ విశేషాలు
1. 108 వైష్ణవ క్షేత్రాలలో 62వ వరాహ క్షేత్రమైన ఈ దేవాలయంలో.. వివాహం చేసుకునేవాళ్లు ఇక్కడున్న స్వామి వారిని కొలిస్తే.. వారికి వెంటనే పెళ్లి కుదురుతుందని భక్తులు నమ్ముతారు.
1. ఈ దేవాలయం పల్లవ రాజుల ద్వారా నిర్మించబడింది. సముద్ర తీరానికి అతి చేరువలో వున్న ఈ ఆలయానికి ముందు భాగంలో ఓ పెద్ద పుష్కరిణి వుంది. దాని పేరు కల్యాణ తీర్థము. ఇక్కడ మూలవిరాట్టు శ్రీ నిత్యకల్యాణ పెరుమాళ్, అఖిలవల్లి అమ్మవారు.
3. గర్భగుడికి కుడిప్రక్కన కోమళవల్లి అమ్మవారి సన్నిధి, ఎడమప్రక్కన ఆండాళ్ళమ్మవారి సన్నిధి కలదు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more