రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీని విజయతీరాల వైపు నడిపించేందుకు అవసరమైన కార్యచరణతో పాటు జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో కలసి వరుస సమావేశాలను నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీని బలెపేతం చేయడంతో పాటు కేంద్రంలో అధికారంలో వున్న పార్టీతో జతకడితే.. సాధ్యమైనంత త్వరగా ప్రజల్లోకి చోచ్చుకెళ్లవచ్చని పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై గత రెండు రోజులుగా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న పవన్.. బీజేపీతో కలిసి వెళ్లడంపై చర్చించినట్టు తెలుస్తోంది. కీలక నేతల వద్ద ఆయనీ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. రాష్ట్రంలో జగన్ ని ఢీకొట్టేందుకు బీజేపీతో చేతులు కలపడం తప్ప మరో మార్గం లేదని జనసేన నేతలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఇటీవల నర్సాపురం పర్యటనలో జనసేన కీలకనేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు మాత్రం తోసిపుచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన స్వష్టంచేశారు.
ఇదిలావుంటే.. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని తానా సభల్లో పవన్ ను కలిసిన బీజేపీ నేత రాంమాధవ్ కోరినట్టు సమాచారం. అయితే అలా విలీనం చేసి తన సోదరుడు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వుండాల్సివచ్చిందని భావించిన పవన్.. బీజేపీతో జతకట్టి అడుగులు వేసేందుకే మొగ్గుచూపుతున్నారని, అంతేకానీ విలీనానికి మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని కొందరు నేతలు పవన్ కు సలహా ఇచ్చినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more