భారత రాజకీయాలలో ఆయనొక శక్తి. బీజేపీ పార్టీ వ్యవస్థాపక నేతలలో ఒకడిగా వుంటూ కేవలం ఉత్తరంలోని పట్టణ ప్రాంతాలకే పరిమితమైన పార్టీని యావత్ దేశవ్యాప్తం చేసిన మూలుపురుషులలో వవఆయన ఒకరు. కేవలం రెండు స్థానాలతో పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన పార్టీకి.. ఆ తరువాత అధికారాన్ని అందించిన మూల పురుషులలో ఆయన ఒకరు. మరోలా చెప్పాలంటే ఆయన పార్టీ కోసం ఉద్యమించిన నేత. పార్టీని దేశ నలుమూలల విస్తరించిన నేత.
ఇంతకీ ఎవరాయనా.? అంటే ఆయనే లాల్ కిషన్ అద్వానీ. 91 ఏళ్ల అద్వానీ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంతో పాటుగా.. బీజేపికి కూడా పెద్ద షాకిచ్చారు. ఈ ద్వయం బీజేపి అధికార పగ్గాలను అందుకున్న తరువాత క్రమంగా తన ప్రతిష్ట మసకబారడంతో.. ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారా.? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఆయన సన్నిహితవర్గాలు తెలిపిన సమాచారం మేరకు ఇకపై ఆయన క్రీయాశీలకంగా పార్టీలో వ్యవహరించరని సమాచారం.
ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అద్వానీ తేల్చి చెప్పారని సమాచారం. మరోసారి గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని అద్వానిని అమిత్ షా కోరారు. అయితే, పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్టు సమాచారం. కనీసం అద్వాని సంతానమైన జయంత్, ప్రతిభలలో ఒకరిని గాంధీనగర్ నుంచి బరిలోకి దింపాలని... వారిని గెలిపించుకునే బాధ్యతను తాము తీసుకుంటామని అమిత్ షా కోరినప్పటికీ, దానికి కూడా అద్వాని నిరాకరించారట.
ఎన్ని అవమానాలు ఎదురైనా, అలసిపోయినా బీజేపీని తమ భుజాల మీద మోస్తూ బీజేపీని సున్నా నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు కొందరు నేతల్లో అగ్రగన్యుడు అద్వారని. వారిలో ముందు వరుసలో ఉంటారు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ. ఎంత ఎదిగినా వొదిగి ఉండటం ఈతరం రాజకీయ నాయకులు ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. అయితే ఇక ఆయన ఎన్నికల బరిలో నిలవబోనని తేల్చిచెప్పడం, తన వారసులను కూడా రాజకీయాల్లోకి రానీయయని చెప్పడం ద్వారా ఆయన బీజేపి షాక్ ఇచ్చారు. దీంతో దేశ రాజకీయ చరిత్రలో మరో అంకం ముగిసినట్టే!
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more