కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత బీజేపి రంధ్రాన్వేషణ చేసి.. ఓ కొత్త విషయాన్ని ప్రజల ముందకు తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం, అసలు ప్రత్యేకహోదా అంశాన్ని రాష్ట్ర పునర్విభజన బిల్లులో కూడా కాంగ్రెస్ పొందుపర్చకపోవడానికి మరో కారణం వుందని బీజేపీ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా రాకుండా అడ్డుపడిన కాంగ్రెస్ పార్టీయే కుట్ర చేసిందని ఆయన కొత్త విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
ఆ కారణమేటంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై 2013లో అప్పటి రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇవ్వడం ఆమోదనీయం కాదని రఘురాం రాజన్ సెప్టెంబర్ 23న నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. దీని ఆధారంగానే ప్రత్యేకహోదా డిమాండ్ ను నిర్వీర్యం చేయాలన్న కుట్రకు కాంగ్రెస్ తెరతీసిందన్నారు. అందుకనే ఈ అంశాన్ని వారు రాష్ట్ర పునర్విభజన బిల్లులో కూడా పెట్టలేదని పేర్కోన్నారు.
ఇక ఎన్నికల తరుణంలో మరోమారు ఆంధ్రులను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సోనియా గాంధీ మరోసారి చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. రఘురాం రాజన్ ద్వారా ప్రత్యేక హోదాకు శఠగోపం పెట్టించారనీ, ఆంధ్రులను మోసం చేస్తూ దొంగనాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. అయితే అన్యాయానికి గురైన అంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో లేకపోయినా రాష్ట్రానికి ప్యాకేజీ రూపంలో ఆర్థిక సాయం చేసిందనీ అన్నారు
ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ఏయే ప్రయోజనాలు చేకూరుస్తారు? అనే విషయాలపై రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు బాగానే వున్నా.. జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ వాసులు మండిపడతున్నారు. రాజకీయ లబ్ది కోసమే బీజేపి నాలుగున్నరేళ్ల పాలన తరువాత తమపై తప్పులేకుండా ఏదో నివేదికను అడ్డువుందన్న విషయాన్ని బీజేపీ తెరపైకి తీసుకువస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కోంటున్నారు.
ఇన్నాళ్లు ఇదే విషయాన్ని బీజేపి ఎందుకు స్పష్టం చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక అటు ఉభయసభల్లోనూ మెజారిటీ వున్న బీజేపి ఏపీకి నిజంగా చిత్తశుధ్దితో న్యాయం చేయాలని భావిస్తే.. ప్రత్యేకహోదా ఇవ్వడం చిన్న విషయమని వారు భావిస్తున్నారు. చట్టల్లో ఏ అడ్డంకులు వున్నా తమకు చట్టసభల్లో వున్న బలంతో సవరణలు చేసి కూడా హోదాను ఇచ్చేవారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని ఆయన కాంగ్రెస్ ను ప్రశ్నించడం, ఇక హోదా వల్ల చేకూరే ప్రయోజనాలను చెప్పాలని రాహుల్ ను ప్రశ్నించడంలోనే ఆయనకు ఏపీ మీద బీజేపి పార్టీకీ, కేంద్రప్రభుత్వానికి వున్న చిత్తశుద్ది కనబడుతుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more