తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిన వేళ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయం నుంచే గవర్నర్ గా సేవలు అందిస్తున్న ఈ.ఎస్.ఎల్. నరసింహన్ కు త్వరలో ఉద్వాసన పలకబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే అది పూర్తి స్థాయిలోనా? లేక కేవలం తెలంగాణకు మాత్రమేనా అన్న విషయంపై మాత్రం స్పష్టం లేదు. ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక విధాన పరిషత్ సభాపతిగా సేవలందిస్తున్న డీ హెచ్ శంకరమూర్తి తెలంగాణ గవర్నర్ గా నియమితం కానున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో శంకరమూర్తి నియామకానికి మోదీ పచ్చజెండా ఊపినట్టు సమాచారం. గత వారంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు శంకరమూర్తితో చర్చించి, ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శంకరమూర్తి నియామకంపై ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడకపోయినా, మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని అంచనా.
కాగా, ఐదుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన శంకరమూర్తి ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని ఈ మధ్యే నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాలైన కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో దేనికైనా గవర్నర్ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధమని ప్రకటించారు కూడా. మంత్రిగా, ఫ్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్ గా, మండలిలో ప్రతిపక్ష నేతగా ఆయన విధులు నిర్వహించారు. ఇంతకు ముందు తమిళనాడు గవర్నర్ గా అవకాశం వచ్చినప్పటికీ, కావేరి వివాదం, పైగా జయ విజ్నప్తితో కేంద్రం ఆ పని చేయలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more