కేంద్ర ప్రభుత్వం అవినీతి, నల్లధనంపై సాగిస్తున్న యుద్దం నేపథ్యంలో దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రానికి అండగా నిలబడిన సామన్యులను ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దని బీజేపి పెద్దలు భావిస్తున్నట్లు వున్నారు. ఇప్పటికే ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు కేంద్ర నిర్ణయంపై దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో ఎలాంటి వివాదాలు, వివాదాస్పద వ్యవహరాల జోలికి వెళ్లవద్దని బీజేపి పెద్దలు నిర్ణయించుకున్నారు.
బీజేపీకి చెందిన కీలక వ్యక్తులతో పాటు తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే సమాచారం అందించి.. వారంతా సర్ధుకున్నాక కేంద్ర పెద్ద నోట్లపై రద్దు నిర్ణయం తీసుకుందని విమర్శలు వస్తున్నాయి. ఇక మరికోందరు అన్ని పెద్దనోటులో అవినీతి నిర్మూలిద్దామన్న కేంద్రం.. ఎలా రెండు వేల రూపాయలను అందుబాటులోకి తీసుకువస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపి పెద్దలు వివాదాలకు తావులేనివిధంగా వ్యవహరించాలని బీజేపి నిర్ణయించింది.
ఇందులో భాగంగా గనుల అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాలను అక్రమంగా సంపాదించారని అభియోగాలను ఎదుర్కోన్న మాజీ మంత్రి గాలిజనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహ వేడుకలకు కూడా దూరంగా వుండాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్పకు ఫోన్ చేసి ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
గాలి కుమార్తె వివాహానికి హాజరు కావాలా? వద్దా? అని సతమతమవుతున్న బీజేపీ నేతలు అధిష్టానం ఆదేశాలతో వెనక్కు తగ్గే అవకాశముంది. ఈ వివాహానికి హాజరైతే అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని అధిష్టానం పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంతో అట్టహాసంగా జరుగుతున్న వివాహానికి ప్రధాని, అమిత్ షా సహా రాష్ట్ర బీజేపి నేతల హాజరు కూడా కష్టమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇదిలావుండగా గాలి జనార్థన్ రెడ్డికి కూడా నోట్ల రద్దు విషయం ముందుగానే లీక్ అయ్యిందని, ఈ నేపథ్యంలో ఆయన ముందుజాగ్రత్త తీసుకున్నాడని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరో ఏఢాది సమయంలో రానున్న ఎన్నికలకు కర్ణాటకలో ఇప్పటి నుంచే వేడి రగులుతుందని, ఈ నేపథ్యంలో అటు పార్టీ విజయావకాశాల కోసం కూడా గాలి జనార్థన్ రెడ్డి డబ్బులను పక్కకు తీసి పెట్టారని, ఎన్నికల సమయంలో ఆయన ఆ డబ్బును తీసి ఖర్చుచేస్తారని కూడా గుసగుసలు గుప్పుమంటున్నాయి. అయితే ప్రస్తుతం ప్రజలు డబ్బుల కోసం అవస్థలు పడుతున్నారని, ఈ తరుణంలో పెళ్లికి హాజరుకాకుండా, ప్రజలు విషయాన్ని మర్చిపోయిన తరువాత ఆయన సేవలను పార్టీకి వాడుకోవచ్చునని కూడా పార్టీ భావిస్తున్నట్లు వార్తలు పార్టీ వర్గాలు సంచరిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more