సజావుగా సాగుతున్న పాలనలో తమ కులాన్ని బీసీల్లో చేర్చాలంటూ ఒక్కసారిగా ఉద్యమాన్ని లేపి రాజకీయ కలకలం రేపాడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకే తాము ఈ డిమాండ్ చేస్తున్నామంటూ రెండు సార్లు ఆమరణ దీక్షకు దిగి ఆపై ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. త్వరలో ఏపీకి చెందిన కాపు ప్రముఖులనంతా కలుపుకుని ఉగ్ర స్థాయిలో ఉద్యమాన్ని లేవనెత్తేందుకు యత్నిస్తున్నాడని సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నాడు. అడ్డుకట్ట వేసేందుకు ఫ్లాన్ ఎంను అమలు చేస్తున్నాడా?
తుని ఘటన, ఆపై ముద్రగడ తొలిదపా ఉద్యమం తర్వాత చంద్రబాబు జస్టిస్ మంజునాథ్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. పేరుకు మాత్రమే ఉన్న కమిటీ ఇన్నాళ్లు చలనం లేకుండా ఉండిపోయింది. అయితే పద్మనాభం పాదయాత్ర చే్స్తారన్న ఇంటలిజెన్స్ వార్తల నేపథ్యంలో, కమిటీని హడావుడిగా రంగంలోకి దింపటం ఆసక్తికరంగా మారింది. గత రెండు ఉద్యమాల కన్నా ఈసారి జరగబోయే డ్యామేజ్ పెద్ద ఎత్తున్న ఉందని భావించిన చంద్రబాబు హడావుడిగా మంజునాథ కమిటినీ జిల్లా పర్యటనలకు పంపినట్లు తెలుస్తోంది.
దాసరి , చిరు, పల్లంరాజు, అంబటి వాళ్లంతా ఈసారి ‘సీరియస్’ గా ముద్రగడకు మద్దతిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాదయాత్ర పవర్ తెలిసిన చంద్రబాబు దానిని అడ్డుకోలేకపోయినప్పటికీ, దాని తీవ్రతను తగ్గించే పనిలో పడ్డాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ కీలక నేతలతో కాపు నేతలను దువ్వే ప్రయత్నం కూడా చేస్తున్నాడని తెలుస్తోంది. ఇంకోవైపు విద్య కోసం విదేశాలకు వెళ్లే కాపు విద్యార్థులకు సాయం అందించడటం ద్వారా అసంతృప్తిని తగ్గించే పనిలో పడ్డట్లు కూడా వార్తలు అందుతున్నాయి.
ప్రస్తుతం తిరుపతిలో మంజునాథ కమిటీ తన పర్యటనను కొనసాగిస్తోంది. జనాభాపరంగా బీసీల ఆర్థిక స్థితిగతులు తదితర అంశాలను పరిశీలించ మూడు నెలలకో, ఆర్నెల్లకో, ఏడాదికో ఇలా నివేదిక ఇస్తూ పోతుంది. ఈ మధ్యలో ఒకవేళ ముద్రగడ ఉద్యమం లేవనెత్తినా కమిటీ తన పని చేస్కుంటూ పోతుందని ప్రభుత్వం చెప్పొచ్చు. మరీ ముదిరితే రాజకీయచేయాలనే ముద్రగడ చూస్తున్నాడని తిప్పి కొట్టోచ్చు. దీంతో ఆయన కాపు ఉద్యమాన్ని ఎంత మేరకు ఎదుర్కొనగలిగే అవకాశం ఉంటే అంతవరకు ఎదుర్కొనేలా ఫ్లాన్ తో మంజునాథ కమిటీని రంగంలోకి దించాడని అర్థమౌతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more