టీటీడీపీ కథ ముగిసింది. అంతా అనుకున్నట్లు గానే తెలంగాణలో ఆ పార్టీకి మిగిలిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి కారెక్కనున్నట్లు ప్రకటించేశారు. మహానాడు ముందు నుంచే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన కార్యకర్తలతో పార్టీ మారే విషయమై ఎడతెరపని చర్చలు జరిపి చివరికి మారాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం టీడీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఒకరు రేవంత్ రెడ్డి, ఇంకోకరు ఆర్.కృష్ణయ్య. అయితే తనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని, తాను టెక్నికల్ గా మాత్రమే ఎమ్మెల్యేనని గతంలోనే ప్రకటించేసుకున్నాడు కృష్ణయ్య. దీంతో రేవంత్ ఒక్కరే టీడీపీ తరపున గళం విప్పే ఏకైక నేతగా మిగిలారు. అసలు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సమయంలో మల్లారెడ్డి పార్టీ మారటం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. కానీ, చంద్రబాబు ఎప్పటి నుంచో కంటున్న కలకు మల్లారెడ్డి గండికొట్టి పోవటం ఇక్కడ చెప్పుకోదగిన అంశం.
తెలుగుదేశం పార్టీకి జాతీయ హోదా కట్టబెట్టాలన్నది చంద్రబాబుకు ఎప్పటి నుంచో ఉంది. తాజాగా జరిగిన మహానాడులో కూడా ఈమేర ఓ తీర్మానం చేశారు కూడా. ఏదైనా ఒక పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం చొప్పున ఓట్లయినా రావాలి.. లేదా దేశం మొత్తమ్మీద ఉన్న లోక్సభ సీట్లలో రెండు శాతాన్ని మూడు రాష్ట్రాల నుంచి పొందాలి. చంద్రబాబు రెండో దాని మీద ఆధారపడాలనుకున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పార్టీకి ఎంపీలుండటంతో మరో రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే చాలు అన్నది ఆయన ప్లాన్. అంతేకాదు మూడో రాష్ట్రంగా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలతోపాటు అండమాన్ నికోబార్ దీవులను ఆయన నమ్ముకున్నారు. తెలుగు ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా సెటిల్ అయి ఉండటంతో పాటు, అక్కడి ప్రభుత్వాలతో బాబుకి మాంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో పొత్తు ద్వారా అయినా సరే ఒక్క ఎంపీ స్థానంలో గెలిచి జాతీయ హోదా కొట్టేయొచ్చని భావించారు.
కానీ, మల్లారెడ్డి ఇప్పుడు చేసిన పనితో అది మళ్లీ కలగానే మిగిలింది. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలపై టీడీపీ ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అంతేకాదు ప్రత్యక్షంగా మల్లారెడ్డిని లాక్కోవటం ద్వారా పరోక్షంగా కేసీఆర్ చంద్రబాబును మరో దెబ్బ కొట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఏదైనా ఒక రాష్ట్రంలో కనీసం ఒక్కో ఎంపీ సీటు అయిన గెలుచుకోవాల్సిన అవసరం ఇప్పుడు టీడీపీ లక్ష్యంగా మారింది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more