వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిలో కొన్ని మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తన సొంత వారి నుండే పోటు తప్పదని అనుకుంటున్నారో లేదా వేరే వేరే కారణాలు ఉన్నాయో కానీ మొత్తానికి తన చెల్లెలు షర్మిలను పక్కన పెట్టడం మీద సర్వత్రా చర్చ సాగుతోంది. వరంగల్ ఉప ఎన్నికల నేపధ్యంలో జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే జగన్ కన్నా ముందు వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా ప్రచారం నిర్వహించింది. రోజా ప్రచారానికి భారీగానే జనాలు రావడం.. ప్రచారం కాస్త హిట్ టాక్ సంపాదించింది. అయితే రోజా పర్యటన తర్వాత జగన్ పర్యటన జరుగుతోంది. అయితే జగన్ కు షర్మిల అంటే గిట్టడం లేదా.? షర్మిలను పక్కన బెట్టి రోజాను ఎంకరేజ్ చెయ్యడం వెనుక అసలు అంతరార్థం ఏంటి..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: పేపర్ పులిలా మారిన జగన్
వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో మొదటి రోజా.. ఆ తర్వాత జగన్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే గతంలో జగన్ జైల్ లో ఉన్పప్పుడు.. జగన్ పర్యటనలు చెయ్యలేని పరిస్థితిలో చాలా సార్లు జగన్ చెల్లెలు షర్మిల పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. పార్టీలో జగన్ తర్వాత స్థానం సంపాదించి.. పార్టీని మరింత ప్రచారం చేశారు. అయితే పాదయాత్రలు చేసి.. పార్టీ కోసం తన అన్న కొసం కష్టపడ్డ షర్మిలను కాదని జగన్ కావాలనే రోజాను తెర మీదకు తీసుకువస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రోజాను ప్రోత్సహించడం కన్నా . షర్మిలను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం మీద అందరికి అనుమానం కలుగుతోంది.
Also Read: పవన్ వల్ల కేసీఆర్ కు ముప్పు తప్పదా..?
షర్మిల .. స్వయానా జగన్ కు చెల్లెలు, వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలు. అందుకే వైసీపీ పార్టీని స్థాపించినప్పటి నుండి పార్టీ కోసం తన అన్న కోసం యాత్రల పేరుతో పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర వహించింది. అయితే నాడు జైలులో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణంలా దూసుకెళ్లిన షర్మిలను ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టారు అన్నది ప్రశ్న. అయితే షర్మిల చరిష్మా అంతకంతకు పెరుగుతోందని.. అలాగే తన బావ అనిల్ వల్ల భవిష్యత్ లో తనకు వ్యతిరేకత వస్తే పరిస్థితులు తారుమారవుతాయని జగన్ బావిస్తున్నట్లు కొంత మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే జగన్ రోజాను ఎగదోయడం మీద కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. రోజా మాటల తూటాలు పార్టీని ఎప్పుడు వార్తల్లో నిలిచేలా చేస్తుందని... అలాగే సినీ గ్లామర్ కూడా తమకు కలిసి వస్తుందని సొంత పార్టీ నాయకులే అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇలా అన్ని కారణాలను బేరీజు వేసుకొని జగన్ షర్మిలను పక్కకు పెట్టి రోజాను ప్రోత్సహిస్తున్నారని ప్రచారం నడుస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more