కాదేదీ కవిత్వానికి అతతీం అన్నాడు శ్రీశ్రీ కానీ.. మన రాజకీయ నాయకులు మాత్రం కాదేదీ కుంభకోణానికి అతీతం అన్నట్లు తయారయ్యారు. ఎందుకంటే అడుగడుగునా కుంభకోణాలు చోటుచేసుకుంటే శ్రీశ్రీ గారి గొప్ప కవితకు అర్థమే మారిపోతుంది. తాజాగా ఓ కుంభకోణంలో కొత్త పేరు వినిపిస్తోంది. ఆ వినిపిస్తున్న పేరు మామూలు వ్యక్తిదే అని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏపి సిఎం చంద్రబాబు నాయుడు పేరు కావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఏంటా కుంభకోణం అనుకుంటున్నారా..? కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్స్. అవును స్కూల్ పేరుతో చేసిన ఓ చాటు మాటు దోపిడీలో చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ వస్తున్న వార్తలు అందరికి ఆశ్చర్యాన్నికలిగిస్తున్నాయి. దాదాపు 400 కోట్ల రూపాయల వరకు జరిగిన వసూళ్లతో బోర్డ్ తిప్పేయడం. దాని వెనుక చంద్రబాబు, అనుచరుల హస్తం ఉందని వార్తలు రావడం విశేషం.
2005లో కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్ లో ‘తరగతిని బట్టి డిపాజిట్ చెల్లిస్తే, పిల్లల చదువు పూర్తయిన వెంటనే తిరిగి మీ సొమ్ము మీకు తిరిగి ఇచ్చేస్తాం’ అని నమ్మబలికారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 56 బ్రాంచిల ద్వారా దాదాపు 400 కోట్లకు పైగా డిపాజిట్లును వసూలు చేసినట్లు అంచనా. ఇందులో చిత్తూరు జిల్లా మదనపల్లిలో రూ.ఆరు కోట్లు, తిరుపతిలో రూ.22 కోట్లు వసూలైనట్లు అధికారులు నిర్ధారించారు. తొలుత ఐదేళ్ల పాటు నమ్మకంగా డిపాజిట్లను తిరిగి చెల్లించిన కేశవరెడ్డి ఆ తరువాత వాయిదా వేస్తూ వచ్చారు. డిపాజిట్ దారులు ఏడాదిగా బ్రాంచిల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదు. కేశవరెడ్డి తీరుపై ఆగ్రహించిన బాధితులు నెలరోజులుగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తమకు న్యాయంచేయాలని ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకున్నారు. కలెక్టర్ స్పందిస్తూ డిఇవో నేతృత్వంలో విచారణ కమిటీని వేశారు. త్వరలో జిల్లాలోని బ్రాంచిలను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గత ఏడాది వరకు బాగానే సంపాదించిన కేశవరెడ్డి సంస్థలు ఇపుడు హఠాత్తు గా ఎందుకు నష్టాల్లో కూరుకుపోయాయి? అలా జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి కారణం చంద్రబాబు కోటరీలో కీలక మంత్రి నారాయణ అని కొంత మంది అనుకుంటున్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థలను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఏపీ మంత్రి నారాయణ ఎత్తుగడ వేశారని. ఈ క్రమంలో ఆ విద్యాసంస్థలను తనదైన శైలిలో ఒత్తిడి చేశారని సమాచారం. తద్వారా పాత మేనేజ్మెంట్ వాటిని సమర్థంగా నడిపించలేక…వాటాదారులకు సొమ్ములు చెల్లించలేక నష్టాల పాలయింది కొంత మంది భావిస్తున్నారు. తాజాగా రంగంలోకి దిగిన నారాయణ త్వరలోనే కేశవరెడ్డి సంస్థలను తన నారాయణ కాన్సెప్ట్ స్కూల్స్ కు అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని వెల్లడైంది. బాబు క్యాబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి తన పాత విద్యా వ్యాపార అనుభవంతోనే 400 కోట్ల సంస్థను మోసం చేసేందుకు స్కెచ్ వేస్తే.. చంద్రబాబు మౌనం వహిస్తున్నారని, దీనివల్ల చంద్రబాబుకు 400 కోట్ల కుంభకోణంతో సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more