సుమారుగా రెండు దశల్లో జరిగిన ఉద్యమం తరువాత సాకారమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతో తమ కష్టాలు దూరమవుతాయని భావించుకుంటూ ఉద్యమంలో క్రీయాశాలక పాత్ర పోషించిన నిరుద్యోగుల ఆశలు అడియాలుగా మారుతున్నాయి. దేశ 29వ రాష్ట్రంగా జూన్ రెండున అవిర్భవించిన తెలంగాణ స్వప్నం సాకారమై 15 మాసాలు కావస్తున్నా.. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. తెలంగాణ వచ్చినా.. మా బతుకుల్లో వెలుగులు లేవు, ఉద్యోగాలతో వెలుగుల్ని నింపాల్సిన పాలకులకు తమను పట్టించుకోవడం లేదంటూ నిరుద్యోగులు అంగళారుస్తున్నారు.
తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేయడమే గగనంగా మారినా.. వాటితో పాటు బిఎడ్, పండిత్ కోర్సులు చేసి.. బతకలేక బడి పంతులు అన్నట్లుగా.. చిన్న ఉపాధ్యయ పోస్టును సాధించి. రేపటి తరాలను, భావి పౌరులను క్రమశిక్షణలో తీర్చిదిద్దేందుకు దోహదం పడదామని ఎదురు చూస్తున్న ఉపాధ్యయ ఆశావహుల ఆశలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఏడాది డీఎస్సీ లేదని ప్రకటనతో అడియాశలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు చేసిన ఏర్పాట్లను అడ్డుకుని.. తమ రాష్ట్ర ఖాళీలను అలాగే ఉంచాలని, వాటిని ఆంధ్రవారితో భర్తీ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అరోపించిన అప్పటి ప్రతిపక్షం.. టీఆర్ఎస్ అడ్డుకుంది.
తలెంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది కావస్తున్నా.. ఆప్పటి ఖాళీలను ఇంకా భర్తీ చేయలేదు. అటు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పదివేల పైచిలుకు పోస్టులకు ఉసాధ్యాయ పోస్టులకు పరీక్షలు నిర్వహించినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చల్లగా చావుకబురు చెప్పిందన్నట్లుగా తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేవు. ఇప్పట్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశమేదీ లేదని ప్రకటన చేసింది. మరి రాష్ట్ర విభనకు ముందు ఉన్న ఖాళీలు ఏమైనట్లు.. ఎవరితో భర్తీ చేశారు. ఎలా భర్తీ చేశారు అన్న అనుమానాలు నిరుద్యోగులలో రేకెత్తుతున్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర సర్కార్ 10,313 పోస్టులను భర్తీ చేసింది. అంటే... ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం తెలంగాణలో సుమారు 8 వేల పోస్టులు ఖాళీగా ఉండాలి! కానీ, ఖాళీలేవీ లేవని మంత్రి కడియం శ్రీహరి ప్రకటించడం నిరుద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా 2012లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయ్యింది. అప్పట్లో 21వేల పోస్టులు భర్తీ చేశారు. ఆ తరువాత 2014లో 18వేల పోస్టులతో నోటిఫికేషన్ రావాల్సి ఉన్నా... అది సాధ్యపడలేదు. కాగా అప్పుడు ప్రకటించిన ఖాళీల్లో సుమారు 13వేలు తెలంగాణ జిల్లాలకు చెందినవేనని సమాచారం.
కాగా, ఈ ఏడాది డీఎస్సీ లేదని ప్రకటించిన ప్రభుత్వం.. వచ్చే ఏడాది ఇప్పుడు అప్పుడు అంటూ.. కాలయాపన చేసిన మరో ఏడాది కూడా అలాగే గడిపితే.. పరీక్షలు రాసేందుకు తమ వయోపరిమితి మించిపోతుందని అశావహులు అందోళన చెందుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 15 వేల సోస్టులకు నియామకాలు చేపడుతున్నామని, వచ్చే నెల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ప్రకటించినా.. ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ ఏమైందో.. ఎందుకు కాలయాపన జరుగుతుందో కూడా అర్థం కావడం లేదని నిరుద్యోగులు అంటున్నారు. మా తెలంగాణ కోటి రతనాల వీణ.. అన్న దశరధీ మాటలను అక్షర సత్యాలు చేయాలంటే.. నిరుద్యోగుల జీవితాలలో సాధ్యమైనంత త్వరగా వెలుగులు నింపాలని తెలంగాణవాదులు కోరుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more