జేసీ దివాకర్ రెడ్డి.. సుదీర్ఘ అనుభవం వున్న రాజకీయ నేత. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా వున్న ఆయన రాష్ట్ర విభజన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని మారిరు. త్రివర్ణ కండువాను పక్కన బెట్టిన ఈయన పసుపు పచ్చ కండువాను తన భుజానిపైన వేసుకున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రయోజనాలను రాష్ట్రంలో కాదు కేంద్రంలో తెల్చుకునేందుకు తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ రహిత నవ్యాంధ్ర ప్రాంతం దీనావస్థలో వుందని.. ఇందుకోసం కేంద్రంలో తమ గళాన్ని స్పష్టంగా వినిపించి రాష్ట్రానికి నిధులు పట్టుకువచ్చేందుకు సమర్థులను హస్తినకు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అందులో జేసి దివాకర్ రెడ్డిని కూడా ఒకరిగా ఎంపిక చేశారు.
సరిగ్గా ఎన్నికల సమయంలో నవ్యాంధ్రలో హోరాహోరిగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్న తరుణంలో.. నువ్వా నేనా అన్నట్లుగా వున్న వాతావరణంలో వారికి కనిపించిన ఆశాకిరణంగా.. ఎన్నికల నడిసంద్రంలో వున్న తమను గట్టుకు చేర్చే నావలా కనిపించింది.. జీవన్మారణాల మధ్య కోట్టుమిట్టాడుతున్న లక్ష్మణునిలా వున్న తమ పరిస్థితిని.. హిమాలయ పర్వతాల నుంచి సంజీవిని తీసుకువచ్చి వీర హనుమంతుడిలా కనబడిన వాడు.. అదే నామాంకితుడు పవన్ కల్యాన్. జనం పక్షాన నిలిచి మాట్లాడిన ఆయన మాటలు.. ప్రజల్లోకి తూటాల్లా దూసుకువెళ్లాయి. 1982లో టీడీపీ స్థాపించిన తరువాత.. ఆ వెనువెంటనే వచ్చిన ఎన్నికలలో భాగంగా స్వర్గీయ ఎన్టీరామారావు ప్రచారంలో వాడిన డైలాగుల మాదిరిగానే పవన్ కురిపించిన ప్రశ్నల వర్షం ప్రజల్లో అవగాహనను కల్పించింది.
అప్పటి వరకు నవ్యాంధ్రలో ప్రజలను ప్రసన్నం చేసుకోవడంతో ముందున్న వైసీపీని కాదని, పవన్ ప్రచారంతో టీడీపీ పక్షాన చేరారు ఎందరో. కేవలం ప్రశ్నించడానికే తన పార్టీ అని, అంతేకాని పదవుల కోసం, సీట్ల కోసం కాదని తేల్చిచెప్పడంతో.. ప్రజలను పవన్ ను విశ్వసించారు. అంతే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఓ పర్యాయం ప్రత్యేక హోదాపై తాను గెలిపించిన టీడీపీ ఎంపీలను పవన్ ప్రశ్నించగానే.. ఎంపీలు, కేంద్రమంత్రి పదవులను అనుభవిస్తున్న వారు ఏకంగా ఎదురుదాడికి దిగారు.
ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సూచించే అధికారం కూడా.. వారిని గెలిపించిన పవన్ కల్యాన్ కు లేదన్నట్టుగా నిలదీయడం ప్రారంభించారు. కేంద్రమంత్రి ఇంద్రజీత్ సింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని రెండో పర్యాయం పార్లమెంట్లులో స్పష్టం చేసిన తరుణంలో టీడీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు. ఎందుకు ఉద్యమిస్తామని చెప్పలేకపోతున్నారు. అయితే కొందరు మాత్రం అది తమకు వర్తించదని, తమకు హోదా దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికోన్నాళ్లు పోయినా తరువాత బిజేపి తమకు హోదాను కల్పిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో అనుభవజ్ఞుడైన రాజకీయ నేత, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా రాదని చంద్రబాబు తెలుసనిని.. అందకనే ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా.. ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఇంగితజ్ఞానం కేంద్రంలోని పాలకులకు లేదు అని విమర్శలు కురిపించారు. ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కల్యాన్ పోరాడాలని.. ఆయనకు తాము మద్దతిస్తామని దివాకర్ రెడ్డి అన్నారు. అయితే పోరాటం చేయాల్సింది పవన్.. పదవులను అలకరించేది మాత్రం టీడీపీ ఎంపీలా అంటూ విమర్శలు వినబడుతున్నాయి. ఎడాదిన్నర క్రితం గెలిచిన ఎంపీలు హస్తినలో ఎం చేస్తున్నారని నిలదీసీ.. వ్యాపారాలు పక్కనబెట్టి ఉద్యమించాలని సూచించినందుకు ఎంతలా ఎదురుతిరిగారో మీరు మర్చిపోయినా.. జనసేన పార్టీ శ్రేణులు, ఏపీ ప్రజలు, పవన్ అభిమానులు మర్చిపోతారా..?
బీజేపి ప్రత్యకహోదా ఇవ్వదని తేలిపోయిందంటున్న టీడీపీ ఎంపీలు పవన్ కల్యాన్ సూచించినట్లు పదవులకు ఎందుకు రాజీనామా చేయరు..? ఎంపీ పదవులలో ఎందుకు కోనసాగుతున్నారు. రాజీనామా చేసి.. ఉద్యమ బాటను ఎందుకు పట్టరు. ఓక్కసారి పదవులకు రాజీనామా చేస్తే.. రాష్ట్ర ప్రయోజనానికి పాటుపడితే.. ప్రజలు వారు బతికివున్నంత కాలం ప్రజాప్రతినిధులుగా చేస్తారన్న విషయం కూడా ఎంపీలకు తెలియదా..? హిందీలో చెప్పినట్లు కల్ కా ముర్గీ సే అజ్ కా అండా బెహతర్ హై అన్నట్లు ఎప్పుడో వచ్చే లాభం కన్నా ఇప్పుడు వచ్చే లాభంపైనే దృష్టిపెట్టిన ఎంపీలు.. రాజీనామాకు ఎందుకు ససేమీరా అంటున్నారు.
ఇక మరికోందరు ఎంపీలు, మంత్రులు, కేంద్రమంత్రులు తమ ఆశలు సజీవంగానే వున్నాయని, మోడీపై తమకు నమ్మకం వుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల వరకు ఈ అంశాన్ని నాన్చి.. అప్పుడు వచ్చే ఎన్నికల తరుణంలో హామినీ నిలబెట్టుకున్నా.. దానిని ఓట్లుగా మార్చుకున్నా.. రాష్ట్ర భవిష్యత్తును మాత్రం ఐదేళ్ల పాటు అందకారంలోకి నెట్టినట్లే కదా..? ఈ విషయం టీడీపీ నేతలకు ఎందుకు అర్థం కావడం లేదు. ప్రశ్నిస్తానని ముందే చెప్పి టీడీపీ నేతలను ప్రశ్నించిన పవన్.. ప్రశ్నలకు టీడీపీ ఎంపీలు ఇచ్చే సమాధానం ఎమిటో.. వారు ప్రజలకు చెప్పకపోయినా.. వారికైనా తెలుసునా..! ఇప్పుడోచ్చి మరోమారు పవన్ ప్రత్యేకహోదా కోసం పోరడమని చెప్పడం భావ్యామా..!!
రాష్ట్రాభివృద్దే ముఖ్యమని అందకనే మాకు ఓటు వేయాలని ఉరూరా ప్రసంగాలతో ఊదరగోట్టిన టీడీపీ నేతలకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాభివృద్ది పట్టదా..? అన్న ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పీఠం ఎక్కగానే రేపు, మాపు అంటూ ప్రత్యేక హోదాపై జాప్యం చేస్తే.. రాష్ట్రానికి ఎనలేని ద్రోహం చేసినవారుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నా.. నేతలు మారరా..? వారికే తెలియాలి. ప్రత్యేకహోదా కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరాన్ని గుర్తించి అన్ని పార్టీలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లే బాధ్యతను కూడా అధికారంలోని టీడీపీ గుర్తించాలి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more