తెలుగు రాష్ట్రాల వివాదాలు తారా స్థాయికి చేరాయి. అయితే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఉంటున్న నరసింహన్ కు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో హడావిడిగా బయలుదేరి వెళ్లారు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలను పరిష్కరించడంలో నరసింహన్ విఫలమయ్యారని కేంద్రం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా గవర్నర్ నరసింహన్ పై కేంద్రానికి గత వారం ఫిర్యాదుచేశారు. అయితే దీనిపై కేంద్రం సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం. అయితే యుపిఎ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ గా నియమితులైన నరసింహన్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా కొనసాగుతున్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా రాష్ట్రాలకు గవర్నర్ లను మార్చింది ఎన్డీయే. కానీ గవర్నర్ నరసింహన్ ను మాత్రం తొలగించడం కానీ బదిలీ చెయ్యడం కానీ చెయ్యలేదు.
అయితే తాజాగా గవర్నర్ నరసింహన్ కు పదవి గండం ఉంది అని ప్రచారం సాగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించలేకపోవడం, చాలా కాలంగా గవర్నర్ పోస్ట్ లో కొనసాగుతుండటంతో తాజాగా నరసింహన్ స్థానంలో కేంద్ర మంత్రి నజ్మా హెప్తులా ను నియమించే అవకాశాలు ఉన్నాయంటూ ఓ వార్త షికారు చేస్తోంది. అయితే నరసింహన్ పదవీ కాలం కూడా ముగుస్తుండటంతో నరసింహన్ స్థానంలో నజ్మా హెప్తుల్లా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు జరిగే హోంమంత్రి సమావేశం తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందా లేక ఓటుకు నోటు వ్యవహారం సద్దుమణిగిన తర్వాత నజ్మా నియామకంపై క్లారిటీ వస్తుందా అన్నది తెలియదు. ఏది ఏమైనా ఓటుకు నోటు, ట్యాపింగ్ వివాదాలు గవర్నర్ నరసింహన్ కు తలనొప్పిని తెచ్చి పెట్టాయన్నది మాత్రం నిజం.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more