ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లుగా వచ్చిన ఆడియో టేపుల ఆధారంగా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు నాయుడుకు ఏసీబీ నోటీసులు జారీ చెయ్యడానికి ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చెయ్యాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేది తెలంగాణ ఏసీబీ కాదు ఏపి ఏసీబీఅట. ఈమేరకు ఏపి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న దానిపై ఏపిలో చాలా చోట్ల పలురకాల కేసులు ఫైలయ్యాయి. ఏపిలో దాదాపుగా 70 కేసులు ఫైలైనట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఏపి ఏసీబీ అధికారులు తమకు లభించిన ఆధారాల ఆధారంగా, వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చెయ్యాలని యోచిస్తున్నట్లు సామాచారం.
తెలంగాణ ఏసీబీ ఓటుకు నోటు వ్యవహారంలో చాలా వేగంగా ముందుకు కదులుతోంది. తాజాగా ఆడియో, వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపించడంతో పాటు ఎంతో కీలకమైన స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసిన తర్వాత మేజర్ స్టెప్ తీసుకుంటారని తెలుస్తోంది. అయితే స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చెయ్యాలని తెలంగాణ ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏసీబీ అధికారుల పని తీరుకు మద్దతుగా నిలుస్తోంది. అందుకే తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు పంపక ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపి అధికారులు నోటీసులు పంపాలని చూస్తున్నారని సమాచారం. మరి ఇద్దరు చంద్రుల రగడ ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more