cash for vote scam chandrababu phone conversations bring him trouble

Chandrababu in trouble over cash for vote scam

nayini narasimha reddy, Telangana home minister nayini, acb holds chandrababu and mla stephen phone conversations recordings, revanth reddy, chandra babau, horsetrading, chandra babu call records, mla stefen, acb officials

cash for vote scam chandrababu phone conversations bring him new troubles as Telangana home minister nayini narasimha reddy says acb holds babu phone conversations recordings

చంద్రబాబు చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు

Posted: 06/03/2015 03:14 PM IST
Chandrababu in trouble over cash for vote scam

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ హాట్ గా సాగుతున్న టాపిక్ ఓటుకు నోటు కుంభకోణం. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఏకంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూ కూడా ఉచ్చు బిగిసుకుంటోందని సమాచారం. ఇప్పటి వరకు లభించిన కేవలం రేవంత్ రెడ్డి వీడియో ఫూటేజ్ ప్రకారం.. ఆయన ఒక్కరే ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అని భావిస్తున్న క్రమంలో.. ఆయనతో పాటు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా ఈ కేసులో వున్నాడన్న వార్తల నేపథ్యంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే క్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణలు తమ దగ్గర ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కూడా కేసు నమోదు చేస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి గెలుపు కోసం చంద్రబాబు.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కోనేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు ఆ ఆధారాలు కూడా తమ వద్ద వున్నట్లు తెలంగాణ హోం మంత్రి నాయిని ప్రకటించిన నేపథ్యంలో ఈ కేసు పూర్తైయ్యే సరికి ఎవరెవరి మెడకు ఉచ్చు బిగిసుకుంటుందోనని కూడా తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

ఓటుకు నోటు కేసులో విచారణ సందర్భంగా అన్ని విషయాలను భయటపడతాయని... చట్టం తన పని తాను చేసుకుపోతుందని నాయిని చెప్పాడంలో అంతరార్థం మాత్రం చంద్రబాబును కూడా ఈ కేసులో సూత్రధారిగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా వుందని తెలుస్తుంది. చంద్రబాబు ఆడియో ఫుటేజి బయటకు వస్తే మాత్రం రాజకీయంగా అది పెను ప్రకంపనలను సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. స్టీఫెన్తో చంద్రబాబు ఏం మాట్లాడారన్నది చాలా కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాజకీయాలలో కూడా పెను మార్పులు సంభవించవచ్చని వార్తలు వినబడుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles