Tdp leaders fire on ysrcp leaders

tdp leaders fire on ysrcp, ap cm n chandrababu naidu,ys jaganmohan reddy, telugu desam party leaders, ysr congress party leaders, war between tdp and ysrcp

tdp leaders fire on ysrcp

అన్నీ బాబు చూసుకుంటే..? మీరెందుకు.?

Posted: 07/01/2014 06:41 PM IST
Tdp leaders fire on ysrcp leaders

అన్నీ బాబు తీసుకుంటే.. మరీ మీరెందుకు  చెప్పండి? అని తెలుగు ప్రజలు అడుగుతున్నారు?  మీరు ఎదుటివారిపై విమర్శలు చేయటం గానీ,  అడిగిన ప్రశ్నలకు  సమాధానం చెప్పే అలవాటే లేదని..  మీ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.  ఒక్కసారి  ప్రజల మద్యకు వచ్చి  పరీక్షించుకోండని.. టీడీపీ నాయకులు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు  టార్గెట్ చేయటం  జరిగింది.

చంద్రబాబు  ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  నాటి నుండి..  వైసీపీ నాయకులు  బాబు పై  ఎడతెరిపిలేని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక అసెంబ్లీలో అయితే   వైఎస్ జగన్ ..  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు  పై పదే పదే  విమర్శించి  అందరి ముందు నవ్వులపాలయ్యాడు.  పదవి చేపట్టిన  పది రోజుల్లోనే.. అన్ని పనులు ఎలా జరుగుతాయని  టీడీపీ నేతలు  వైసీపీ నేతలపై ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే.

చంద్రబాబు  అధికారంలోకి  వచ్చాడు.. వర్షాలు పడటం లేదు?  బాబు వచ్చాడు.. జాబులు పోయిందని  ఒక్కటే గోల చేస్తున్నారు.  అసలు ఇంతకీ మీరేంచేస్తారో  ప్రజలకు ఒక్కసారైన చెప్పారా? అని టిడిపి నేతలు  అంటున్నారు.   అంతేకాకుండా  ఆంధ్రప్రదేశ్ లో..ఏం తప్పు జరిగి,  ఏవరు తప్పు చేసిన,  అంత చంద్రబాబు తప్పుగా వైసీసీ నేతలు  అభివర్ణించారు.  అయితే  ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసు స్టేషన్లో  ఎస్ ఐ  దురుసుతనంతో  వైఎస్సార్   కాంగ్రెస్ పార్టీ నేతల  మరణించటంతో  కూడా బాబుతే  బాధ్యతని  జగన్ నేతలు  ఆరోపిస్తున్నారు.

ys-jagan-cm-babu

అసలు  అక్కడ ఎస్ ఐ,  వైసీఎ  నేతల  భాస్కరరెడ్డకి ..  మద్య వాగ్వివాదం జరిగి.. ఎస్ ఐ   దురుసుతనంతో  చేయి చేసుకోవడం.. ఆయన కిందపడిన  సమయంలో   గుండె నొప్పి రావటంతో.. పోలీస్ స్టేషన్లో  చనిపోవటం జరిగిందని   స్థానికులు చెబుతున్నారు. ఆ విషయాన్ని   వైసీపీ నేతలు    చంద్రబాబుకు  లింకు పెట్టి,     ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి  కొత్త చరిత్ర కావాలే కానీ.. రక్త చరిత్ర  కాదంటూ  బాబుకు  హితువు చెప్పటం ..  తెలుగు ప్రజలకు ఆశ్చర్యం కలుగుతుంది.  

గతంలో..  జగన్ తండ్రి అధికారంలో ఉన్నప్పడు జరిగిన  రక్త చరిత్ర కంటే.. ఇప్పుడు జరిగింది  పెద్ద గొప్ప కాదులేని ..టీడీపీ కార్యకర్తలు  అంటున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  పదవిలోఉన్న సమయంలోనే..టీడీపీ లోని ముఖ్యనాయకులు, కార్యకర్తలు రక్తచరిత్రలో కలిసిపోయారని  టీడీపీ నాయకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.  అప్పడు  ఈ నేతలు.. కళ్లు ముసుకున్నారా?  అని టీడీపీ కార్యకర్తలు ఆవేశంగా అంటున్నారు. అసలు  ముందు మీరు ఏం చేస్తారో  చెప్పండని  వైసీపీ నేతలు  నిలదీస్తున్నారు.   టీడీపీ ప్రశ్నలకు..వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles