దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి, ముద్దుల కూతురు వైఎస్ షర్మిల పేరు తెలియని వారు ఎవరు లేరు. ప్రత్యక్షంగా రాజకీయల్లోకి రాకపోయిన, తన సోదరుడైన , కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి కోసం, రాష్ట్రంలో మొదటి మహిళ పాదయాత్ర చేసి జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రజలకు బాగా దగ్గరై రాజన్నా కూతురుగా మంచి పేరు తెచ్చుకుంది.
జగనన్నా వదిలి బాణంగా జనం మద్యలో తిరుగూ.. తెలుగు ప్రజలకే పంగనామాలు పెట్టాడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ‘‘ చిల్లర దొంగ జైలుకెళ్లి బయటకు వస్తే అతన్ని సమాజం కొంచెం దూరంగా పెడుతుంది’’ కొత్త వచ్చిన వారికి కూడా .. అతని గుర్చించి చెబుతుంటాడు. అతని పై సమాజంలోని జనాలు ఒక కన్ను వేసి ఉంచుతారు. ఇది జగమేరిగిన సత్యం.
నీ జగన్ మాత్రం అలా కాదండోయ్. జగన్ మంచి బాలుడు( రాముడు మంచి బాలుడు) చిన్నప్పుడు చదువుకున్నట్లు.. ఇప్పుడు ఆ పార్టీ ఆఫీస్లు ఇదే చదుకుంటున్నారు. ఇటీవల జగన్ భార్యకూడా ఒక మీడియా మందు ‘‘మా ఆయన బంగారం’’ అని చెప్పటం జరిగింది. భర్త మీద ప్రేమతో భారతి అలా చెప్పి ఉంటుందని.. తెలుగు ప్రజలు సర్థుకుపోయారు.
అన్న లో పెరుగుతున్న ఆశ.., రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అలాగే జగన్ కూడా ఒక గోల్ పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి కావటమే ఆయన గోల్. దాని కోసం .. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, భార్య భారతి, బావ, అనిల్ బ్రదర్ నిరంతరం, పగలు రాత్రి, అని తేడా లేకుండా కష్టపడుతున్న విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తెలుసు. వీరితో పాటు..కొంత మంది రాజకీయ నాయకులు సైతం.. జగన్ ముఖ్యమంత్రి కావాలని నిద్రహారాలు మానుకోని ఆయన పెట్టిన పార్టీ కోసం సేవాలు చేస్తున్నారు.మరి కొంత మంది అయితే వారి కుటుంబాలను, భార్య పిల్లల్ని సైతం వదిలిపెట్టి, జగనన్నా ముఖ్యమంత్రి కావాలని పార్టీల ఆఫీసుల వద్ద .. తప్పసు చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు వైఎస్ మీద ఉన్న అభిమానమో, లేక జగన్ చేసిన ఓదార్పో, షర్మిల పాదయాత్రో, విజయమ్మ కన్నీరో గానీ .. తెలుగు ప్రజలకు చాలా ప్రేమ అభిమానం ఉండేది. 5 సంవత్సరాల నుండి.. వైఎస్ పై ప్రేమ ను పంజరంలో పెట్టారు. కానీ 2014 ఎన్నికల పుణ్యమా అని .. పంజరంలోని ప్రేమ కాస్త ఎగిరిపోయింది. అలాగే పూర్తి తగ్గలేదు.. రాష్ట్రలోని క్రిష్టియన్లు, రెడ్డి వర్గం వారు వైఎస్ పై ప్రేమను అలాగే ఉంచుకున్నారు. కానీ ఇటీవల నేతల మద్య జరుగుతు మాటల వార్ తో పార్టీకి పెను ప్రమాధం ఏర్పాడిందని రాజకీయ మేథావులు అంటున్నారు.
ఇప్పుడు జగన్ కు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుండి పెను ప్రమాదం పొంచి ఉంది. నిన్నటి వరకు నా మాటకు, నా బాటకు ఎదురులేదని గర్వంగా ఓదార్పుయాత్ర చేసిన జగన్ కు .ఇప్పడు ‘‘ఓదార్చే వారు కోసం జగన్ నలుదిక్కలు వైపు ఆశగా ఎదురు ’’చూస్తున్నారు. పవన్ కు రాజకీయ అనుభవం లేదు, కేవలం ఒక సినిమా నటుడు, కాబట్టి ఓటర్ల కన్నా చాలా తక్కువ అభిమానులు ఉంటారు. ‘‘అలాంటి పవన్ పంజా దెబ్బకు వైఎస్ కోటలో బీటులు రావటం మొదలుపెట్టింది’’. ఊహించని పంజా దెబ్బకు .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు , తమ తమ ఆయుధాలతో వార్ చేయడం మొదలుపెట్టారు.
కానీ ఇక్కడే పెద్ద పోరపాటు జగన్ పార్టీ నాయకులు చేయటం జరిగింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని నూతన నాయకుడు పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.., పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితంలోకి దొంగచాటుగా చూసి, మీడియా ముందు కంపు నోర్లు తెరిచారు. వీరి కంపు నోర్లు దెబ్బకు..కొన్ని మీడియా సంస్థలు.. ముఖం చాటేసాయి. దీంతో జగన్ సొంత మీడియాలోనే అరిచి, అరిచి అలసిపోయి ..నేడు రేస్టు తీసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న తంతుని తెలుగు ప్రజలు అందరు గమనించారు. ‘‘అడిగి ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే.. అడ్డగాడిద అని చిన్నప్పుడు ప్రతి తెలుగు పంతూలు తిట్టేవాడు. ’’ ఆ తిట్టు తెలుగు ప్రజలు ఒక్కసారి గుర్తు చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాన్ మాత్రం తన పార్టీ ముఖ్య ఉద్దేశం, టిడిపి, బిజేపి ఎందుకు మద్దతు ఇచ్చింది పుల్ క్లారీటిగా చెప్పి, రాజకీయ ప్రత్యర్థిల పై ఎన్నికల సమయంలో విరుచుకుపడ్డారు. రాజకీయ నేతల అవినీతి , అక్రమా దందాల గుర్తించి తెలుగు ప్రజలకు వివరించి చెప్పటం జరిగింది. ‘‘గురివింద కింద నలుపు గురించి చెప్పకుండా తిరిగే నాయకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు’’. అలాంటి వారిలో మొదటి పేరు వైఎస్ జగన్ దే. ఇలా ప్రాంతీయ భేదం లేకుండా తెలుగు ప్రజల అభివ్రుద్ది ద్వేయంగా .. ముందుకు పోతు, జరుగుతున్న ఎన్నికల్లో అవినీతి నాయకులను తరిమికొట్టండని పవన్ పిలుపు ఇవ్వటం జరిగింది. ‘‘అప్పటి వరకు రూపాయికి ఒకవైపే చూసిన ప్రజలు, రెండో వైపు చూసి షాక్ తిన్నారు’’. పవన్ మాటల్లో నిజాయితి, ఆ దైర్యం, ఆ తెగువా , తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకుంది. దీంతో జగన్ గ్యాంగ్ మరోసారి పవన్ పై విమర్శల దాడి చేయటం మొదలు పెట్టారు.
జగన్ పార్టీలోని ఒక మహిళ నాయకురాలైతే.. ‘‘పవన్ చస్తే ఆ ముగ్గురు భార్యలో ఎవరు...? ’’ అని, తెలుగు ఆడవాళ్లు పరువు తీసింది? దీంతో ..జగన్ పార్టీకి ఉన్న అభిమానం, గౌరవం, ఓదార్పు, అన్ని గాలీలో కలిసిపోయాయి. పవన్ అడిగి ప్రశన్నలకు ఏ ఒక్క నేత కూడా సమాదానం చెప్పకుండా.. ఘోరమైన విమర్శలు చేయటం జరిగింది. ఇలాంటి సమయంలో జగనన్నా వదిలి భాణం కూడా పవన్ పై పెపర్ లాంటి విమర్శలు చేసి, పాపం తెలుగు ప్రజల ముందు నవ్వులపాలైంది.
ఎన్నికల ప్రచారం చివరి రోజు కావటంతో.. విశాఖలో షర్మిలా మాట్లాడుతూ.. మీ వద్ద కు ఒక పిచ్చోడు వచ్చి, మూడు సొల్లు మాటలు, ఆరు తిక్కమాటలు మాట్లాడితే మీరేం చేస్తారు? పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఆయన కు తిక్క ఉన్న పిచ్చోడో , అతను చెప్పే మాటలు పట్టించుకోవద్దని తెలుగు ప్రజలను కోరారు. అయితే పవన్ ఒక్కడే చెప్పివే పిచ్చి మాటలు, సోల్లు అయితే.. మరీ .. మీ కుటుంబం మొత్తం చెప్పే మాటలను ఏమంటారు? ఆమె సభలోని ప్రశ్నలు పైకి లేచాయి. అంతేకాకుండా షర్మిల మరో అడుగు ముందుకేసి ‘‘కొత్తగా పెళ్లైన మొగుడు పెళ్ళాల’’ స్టోరి చెప్పింది.
ఇక్కడ కొత్తగా పెళ్లైన మొగుడు పెళ్లాలు ఎవరు అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్. ఈ ఇద్దరికి వైఎస్ షర్మిల పెళ్లి చేసింది. అంతేకాదండోయ్. ఆ ఇద్దరి మద్య జరిగి ముచ్చట్లు గురించి చాలా గొప్ప చెప్పి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చింది. అంటే పవన్ గురించి చంద్రబాబు పొగడం, బాబు గురించి పవన్ చెప్పటం కొత్తగా మొగుడుపెళ్లాల ముచ్చటగా ఉందని షర్మిల చెప్పి అందరి గుర్తు చేశారు.
కానీ 5 సంవత్సరాల నుండి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి , జగనన్నా గురించి ఎన్నో కొత్త ముచ్చట్లు చెప్పినారు.. మరీ వాటి గురించి ఏమంటారు జర జెప్పరాదే షర్మిలక్కా? నువ్వు జేపితే.. మేము వినకుండా పోతామా? అని తెలుగు ప్రజలు ప్రశ్నలు సంద్ధించారు. కానీ అటు వైపు నుండి సమాధానం రాలేదు? కారణం ..షర్మిలకు జరిగింది రెండో పెళ్లి కాబట్టి, అదే జగన్ భార్య భారతి అయితే..తప్పకుండా సమాధానం చెప్పి ఉండేదని.. తెలుగు ప్రజలు అనుకుంటూ.. షర్మిల సభ నుండి లేసి వెళ్లి పోయారు.
మా ఓటు కోసం మా వద్దకు వచ్చిన మహిళ నేతలు, మగ నేతలు, అవినీతి అబ్బాయిలు, దందాలు చేసే.. నాయకులు , మీరు, మీకుటుంబం సల్లాగుండాలే. కేవలం మా ఓటు కోసమే మీరు వచ్చారని మాకు తెలుసు. కానీ మా అభివ్రుద్ది కోసం కాదని తెలుసు. ఎందుకంటే.. మేము మీకు అధికారం ఇస్తేనే మాకు అభివ్దుది చేస్తామని హామీలు ఇవ్వటం జరిగింది. ఇన్ని రోజులు మీరు చెప్పిన కహానీలు, సోల్లు మాటలు విని, విని మా చెవులకు రంద్రాలు పడ్డాయి. మీరు మళ్లీ మా వద్దకు వచ్చేది 2017 ఎన్నికల సమయంలోనే అని మాకు బాగా తెలుసు.
అందుకే.. మాతో కలిసిపోయే, మాకు న్యాయం చేసి, మా జీవితాల్ని, మా బిడ్డల భవిష్యత్తును మార్చే ప్రభుత్వానికే ఓటు వేస్తాం, నిజాయితీ గల నాయకుడ్ని ఎన్నుకుంటాం, మీరు చెప్పే పిట్ట కథలకు., అవినీతి హామీలకు మా భవిష్యత్తును తాకట్టు పెట్టలేం అని తెలుగు ప్రజలు అంటున్నారు. ‘‘పదండి ఓటేద్దాం.. అవినీతి అబ్బాయిలను తరిమికొడదాం’. మీ అవినీతి బాగోవతానికి తెరదించుతాం. మా ఓటుతో నూతన ప్రభుత్వానికి తెరలేపుతాం? మే 16 మీ అవినీతి జీవితానికి ఆఖరి డే.. తెలుసుకోండి?
కొసమెరుపు: ఏ పార్టీ పై అభిమానంతోనో, ఏ నేత పై ప్రేమతోనో ఇక్కడ రాయలేదు. తెలుగు ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో, ఏం అనుకుంటున్నారో, తెలుగు ప్రజలు ఏం కావాలో తెలియజేయటం జరిగింది. మరకలేని స్వచ్చమైన నేత కోసం, ప్రభుత్వం కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్న విషయం అందరు తెలుసుకోవాలి. మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం, మన ప్రజలు , మన భాష, మన ఆచారాలు , మన పెద్దలు, మన నేతలు, మన బిడ్డలు, మన భవిష్యత్తు, మన అభివ్రుద్ది ., అంతా బాగుండాలని కోరుకుందాం..
ఇట్లు
పవిత్రమైన ఓటు హక్క కలిగిన ప్రజలు..
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more