ఈయన ఒక ప్రజాప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ పదవిని అనుభవిస్తున్నారు. ప్రజా నాయకుడిగా పది మందికి ఉపయోగపడకపోయిన.. తన యొక్క వింత , వింత వేషాలతో.. పది కోట్ల మంది ప్రజలకు ఈ ఎమ్మెల్యే బాగా తెలుసు. ఈయన గురించి పక్క రాష్ట్రం ప్రజలు కూడా ఈ ఎమ్మెల్యే వింత వేషాలకు నవ్వుకుంటున్నారు.
ఈ ఎమ్మెల్యేని అందరు ముద్దుగా నెల్లూరు నటరాజా అని పిలుకుంటారు. ఇప్పటికే మీకు అర్థమైఉండాలి. నెల్లూరు జిల్లా ఆనం బ్రదర్స్ అంటే తెలియాని వారు ఎవరు ఉండారు. ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి , ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి.
అన్న రాష్ట్ర ఆర్థిక విషయాల్లో బిజీ బిజీగా అసెంబ్లీలో గడుపుతుంటే.. తమ్ముడు మాత్రం అసెంబ్లీ ఆవరణంలో..హాయిగా దమ్ము(సిగరెట్టు) కొడుతూ మీడియా కు ఫోజులు ఇచ్చిన ఎమ్మెల్యేగా.. రాష్ట్ర ప్రజలు గుర్తించారు.
ఎమ్మెల్యే ఆనం రెడ్డి అంటేనే.. ఒక డిఫరెంట్ లూక్. ఆయన ఏసందర్భానైన ..తనకు అనుకూలంగా మలుచుకున్నసత్తా ఆనం వివేకానందరెడ్డి లో పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర మేథావులు ఎప్పుడో గుర్తించారు. ఈయనలోని కొన్ని ప్రత్యేకతలు, గుర్రం ఎక్కి స్వారీ చేయగలడు, హీరోయిన్స్ , నగలు , చీరలు కట్టగలడు, ఆడవారి నగలు ధరించిన అర్హత కూడా ఈఎమ్మెల్యేకే దక్కింది. డప్పు కొట్టగలడు, పబ్లిక్ లో ..తీన్ మార్ డ్యాన్స్ వేయగలడు.
మున్సిపాలిటి కుళాయి వద్ద మంచి నీళ్లు పట్టి, బిందెను నెత్తిన పెట్టుకొని వయ్యరంగా క్యాట్ వాక్ చేయగల నైపుణ్యం ఉన్న నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి . ‘‘ఇలా రాసుకుంటా పోతే.. రామాయణం , చెప్పుకుంటే పోతే మహాభారతం అవుతుంది.’’
అయితే ఈసారి మరో కొత్తదనంతో నెల్లూరు ప్రజల ముందుకు వస్తున్నాడు ఎమ్మెల్యే ఆనం. ఈసారి నెల్లూరు జిల్లాలో ఉన్న విద్యార్థలను ఆయన టార్గెట్ చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపైనే ఈ ఎమ్మెల్యే మనసు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం ఎమ్మెల్యే ఆనం చేస్తున్నారు.
పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి ..ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్స్ ను పంపిస్తున్నారు. ఈ గ్రీటింగ్స్ వల్ల పదో తరగతి విద్యార్థులకు ఏం ఉపయోగం అని చాలా మంది అనుకున్నారు. కానీ విద్యార్థులకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు..కానీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డికి మాత్రం చాలా ఉపయోగం ఉందని.. కొంత రాజకీయ మేథావులు అంటున్నారు.
ఈ మార్చిలో పదో తరగతి పరీక్ష జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే ఒక బంఫర్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. నెల్లూరు జిల్లాను పేరు నిలబెట్టిన విద్యార్థికి అన్నీ ఫ్రీ.. అనే సందేశాన్ని ఆ గ్రీటింగ్ కార్డులో ఉన్నట్లు సమాచారం.
అంతేకాదు.. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆ గ్రీటింగ్ కార్డులోనే శుభాకాంక్షలు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో..మీ పవిత్రమైన ఓటును.. నాకే వేయ్యాలనే ఉద్దేశంతోనే ముందుగా ఆనం ఎమ్మెల్యే ఈ గ్రీటింగ్ ప్రయోగం చేస్తున్నాడని ప్రతిపక్ష నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
ఏమైన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం నుండి గ్రీటింగ్స్ కార్డు రావటంతో..విద్యార్థులు చాలా ఆనందంగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆనం గ్రీటింగ్ కార్డు చూసిన స్థానికులు ఏ ప్రైవేటు జూనియర్ కాలేజీతోనే చీకటి ఒప్పందం కుదుర్చుకోని, పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో బిజీనెస్ చేస్తున్నాడని నెల్లూరు జిల్లా స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.
ఏమైన ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి స్టైలే ..సపరేటు అని రాజకీయ నాయకులు నవ్వుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more