భారతీయ జనతా పార్టీ లో .. ఎల్ కే బాంబు పేలింది. అసలే అసహనంతో ఉన్న ఎల్ కే బాంబు.. ఎట్టకేలకు తెలంగాణ బిల్లు పై బాంబు పేల్చారు. తెలంగాణ బిల్లు కు బిజేపి మద్దతు ఇవ్వదని .. భిజేపి అగ్రనేత ఎల్ కే అద్వానీ తీవ్రమైన ఆగ్రహంతో చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిలు విషయంలో తమను దోషులుగా నిలబట్టే ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పూనుకుందని బిజేపి కార్యకర్తలు అంటున్నారు.
ఇటీవల తెలంగాణ బిల్లుకు సహకరించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్ కే అద్వానిని కలిసిన సందర్భంలో ఆయన వారిపై సీరియస్ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ బిల్లు చాలా న్యాయపరమైన చిక్కులున్నాయని ఎల్ కే అద్వాని చెప్పినట్లు తెలుస్తోంది.
నేను నాలబై సంవత్సరాల నుండి పార్లమెంటు లో ఉన్న కానీ .. తెలంగాణ బిల్లు లాంటి దారుణమైన బిల్లును నేను చూడలేదని ఎల్ కే అద్వానీ చెప్పినట్లు పార్టీలోని సీమాంద్ర నాయకులు అంటున్నారు. ఈ పరిస్థితిలో తాము బిల్లుకు మద్దతు ఇవ్వలేమని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఇస్తామని అద్వానీ అన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస తీరుపై బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు కూడా తీవ్రంగా మండిపడ్డారు. న్యాయశాఖ చెప్పే వరకు బిల్లు ఏదనేది ప్రభుత్వానికి తెలియలేదా అని ఆయన అడిగారు. ఇప్పటికైనా బిల్లును లోకసభలో పెడతారనే నమ్మకం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పినట్లు సమాచారం.
అసలు కాంగ్రెస్ పార్టీనే బిల్లు పెడుతుంది, కాంగ్రెస్ పార్టీవారే వ్యతిరేకిస్తారు అని వెంకయ్య నాయుడు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ విషయంలో తమ నిజాయితీని శంకించే అవసరం ఎవరికీ లేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది .
ఈ సమయంలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందకపోతే నెపం తమపై నెట్టేందుకు కాంగ్రెసు వ్యూహం రచించిదని వెంకయ్య నాయకుడు చెప్పటం జరిగింది . ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో కొత్త డ్రామాకు తెరలేపందని ఆయన చెప్పటం జరిగింది. అంటే వెంకయ్య నాయుడికి .. ఎల్ కే బాంబు బలం దొరకటంతో.. ఆయన పార్టీలో చాలా హుషారుగా ఉన్నట్లు పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ కొత్త డ్రామాలో భాగంగానే ఆరుగురు పార్లమెంటు సభ్యులపై ఇప్పుడు వేటు వేశారని నాయుడు గుర్తు చేయటం జరిగిందని సమైక్యవాదులు అంటున్నారు.
అంతేకాకుండా సీమాంద్ర కాంగ్రెస్ ఎంపీ చాలా అమాయకులు అని వెంకయ్య చెప్పటంతో వెనుక మర్మం అర్థంకాలేదని పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు. అయితే వెంకయ్య నాయుడు , సీనియర్ నేత ఎల్ కే అద్వానితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఎల్ కే ఇచ్చిన బూస్ట్ తో వెంకయ్య మాట్లాడుతున్నారని తెలంగాణ నేతలు అంటున్నారు.
అందుకే వెంకయ్య నాయుడు రాష్ట్ర విభజనకు తమ పార్టీ ఎప్పుడూ అనుకాలమేనని కాకపోతే సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని చెప్పటమే.. ఎవరికి అర్థం కావటం లేదని పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు. ఎల్ కే బాంబు బలంతో వెంకయ్య నాయుడు సమైక్యరాగం బలంగా పాడిన ఆశ్చర్యంలేదని .. పార్టీలోని సీనియర్ నాయకులు జోకులు వేసుకుంటున్నారు.
కొసమెరుపు: తెలంగాణ బిల్లు పై బిజేపి .. కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెడుతుందో ..లేక బిజేపియే ఇరుకునపడుతుందో, లేక ఇద్దరు కలిసి తెలంగాణ బిల్లు పై ఒకే నిర్ణయం తీసుకుంటారో చూద్దాం . ఎందుకంటే.. తెలంగాణ బిలు పై .. ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ విందు ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి రాజకీయ విందులతోనే.. అనేక బిల్లులు ఆమోదం పొందినట్లు చరిత్ర చెబుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more