ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖా మంత్రి లిక్కర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఓవైపు మహిళలంతా కలిసి బెల్ట్ షాపులను ఊరి మధ్యలోంచి తరిమి కొడుతున్న వేళ బీర్ ఓ హెల్త్ డ్రింక్ అని పేర్కొనటం సిగ్గు చేటు అని వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగింది.
వైసీపీ కార్యాలయంలో మీడియ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ చర్యలను చూస్తుంటే రానున్న రోజుల్లో విద్యార్థులతో కూడా బీరు తాగించేలా ఉన్నారని ఆమె మండిపడింది. అంతేకాదు అమ్మాయిలను కూడా మందు తాగమనే దౌర్భాగ్య సంస్కృతిని ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విమర్శించింది. స్కూళ్లు, గుళ్ల మధ్య వైన్ షాపులను వైసీపీ అంగీకరించదని, అవసరమైతే ప్రజా పోరాటానికి మద్ధతుగా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఆమె ప్రకటించింది. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన తెలుగుదేశం ప్రభుత్వం... తాగుబోతు ప్రభుత్వంలా మారిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. జాతీయ రహదారుల పక్కన లిక్కర్ షాపులు ఉండకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించినా ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్క చేయడం లేదని... వైన్ షాపుల కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రోడ్లుగా డీనోటిఫై చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీరు-మీరు కార్యక్రమం తరహాలో నీరు-బారు కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. మెడికల్ షాపుల్లో కూడా బీరు అమ్మేలా ఉన్నారని అన్నారు. చంద్రబాబుకు మహిళల ఉసురు తప్పకుండా తగులుతుందని అన్నారు. మద్యం పాలసీని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయం 3 కోట్ల విలువైన ఎర్రచందనం ను పోలీసులు స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన దుండగులు హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డారు. దీంతో ఎర్ర చందనాన్ని అమ్మే హెరిటేజ్ ను అభివృద్ధి చేశారా? అంటూ రోజా చంద్రబాబును ప్రశ్నించింది. నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు పొలంలో కూడా ఎర్రచందనం దుంగలు దొరికాయంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిందామె.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more