రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ ప్రతిపాదించిన మీరాకుమార్ ను కాదని, రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మద్ధతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశాడు. తెలుగు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వ అభ్యర్థికి మద్థతు ఎలా ఇస్తారని, వైఎస్ ఫోటో పెట్టుకునే అర్హత కూడా లేదంటూ అందులో మండిపడ్డాడు. దీంతో వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగాడు.
రఘువీరా లేఖ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కూడా ఒక లెటర్ హెడ్ ఉందనే విషయం తెలిసిందని ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోనియాగాంధీ కుమ్మక్కై జగన్ ను జైలుకు పంపిన విషయాన్ని ఎవరూ మర్చిపోరని అన్నారు. అన్యాయంగా జగన్ ను జైలుకు పంపిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ దని చెప్పారు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఆ సమయంలో మీరాకుమార్ స్పీకర్ గా ఉన్నారని... అలాంటి వ్యక్తికి రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎందుకు మద్దతు ఇవ్వాలని నిలదీశాడు.
కుక్కలు చింపిన విస్తరిలా ఉన్న కాంగ్రెస్ ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖరరెడ్డిదని భూమన అన్నాడు. వైయస్ పేరును ఉచ్చరించే అర్హత కూడా కాంగ్రెస్ కు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ఈజిప్టు మమ్మీకి తేడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తమకు సలహా ఇచ్చే స్థాయి కాంగ్రెస్ కు లేదన్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more