వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో కుండపోత వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు శాంతించాడని భావిస్తున్న క్రమంలో మరో పిడుగులాంటి వార్తను వెలువరించింది హైదరాబాద్ వాతావరణశాఖ. బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర చత్తీస్ గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాలపై ప్రభావం చూపుతూ వాయవ్య, పశ్చిమ ప్రాంతాల మీదుగా కదిలి బలహీనపడుతుందని చల్లని కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ ఆ వెంటనే మరో పిడుగులాంటి వార్తను వెలువరించింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయిని తాజాగా చెప్పింది. బంగాళఖాతంలో ఈ నెల 19 వరకు ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీంతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. అయితే ఈ అల్పపీడనం ప్రభావం ఒడిశాపై తీవ్రంగా పడనుందని.. ఒడిశాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇటు తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపునందని వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ.. ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది. కాగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్పపీడన ప్రభావం ఏర్పడనుందని తెలిపింది. ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more