పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ అందరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేయాలని కేంద్రం సూచించింది. తక్కువ ధరకు జాతీయ జెండాలను అందించాలన్న ఉద్దేశంతో వాటిని అన్ని రేషన్ షాపులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంచింది. రేషన్ షాపులు, పోస్టాఫీసుల్లో 20 రూపాయలకే జాతీయ జెండా లభిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసింది ప్రభుత్వం.
అయితే, హర్యానాలో ఒక రేషన్ షాపు యజమాని ఒక అడుగు ముందుకు వేసి. జాతీయ జెండా కొంటేనే రేషన్ ఇస్తానని పేదలపై ఒత్తిడి చేయడం సంచలనమైంది. జెండా కొంటేనే రేషన్ ఇస్తామని చెప్పి తమతో బలవంతంగా రూ. 20 పెట్టి జెండా కొనిపిస్తారని ఒక వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. క్షణాల్లో అది వైరల్ అయింది. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వరకూ ఆ వీడియో చేరింది. దాంతో వెంటనే ఆయన ఆ వీడియోను షేర్ చేస్తూ.. సొంత పార్టీ పైననే విమర్శలు గుప్పించారు. స్వతంత్ర స్వర్ణోత్సవాల వేళ ఇలాంటి ఘటన సిగ్గుచేటని ఎండగట్టారు.
75 ఏళ్ల స్వతంత్ర ఉత్సవాలు పేదవాడిపై భారంగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతీ భారతీయుడి గుండెల్లో ఉండే తిరంగా బలవంతంగా కొనిపించడం ఏంటని, కొనలేని పేదవాడి నోటి దగ్గర నుంచి ఆహారాన్ని లాక్కోవడం ఏంటని ట్విటర్లో తీవ్రంగా ప్రశ్నించారు. హర్యానాలోని ఒక రేషన్ షాపులో ఈ కండిషన్ పెట్టారు. రూ. 20 పెట్టి జాతీయ జెండా కొనాలని, లేదంటే రేషన్ ఇవ్వమని చెప్పారు. ఇదే విషయాన్ని అక్కడి వినియోగదారుడు ఒకరు వీడియో తీశారు. పై నుంచి ఆదేశాలు వచ్చాయని, అందువల్లనే అలా జాతీయ జెండాను బలవంతంగా అమ్ముతున్నామని ఆ రేషన్ షాపులో పనిచేసే వ్యక్తి చెప్పిన విషయాన్ని కూడా ఆ వీడియోలో పొందుపర్చారు.
ఈ వీడియో వైరల్ కావడంతో.. అధికారులు రంగంలోకి దిగి.. ఆ రేషన్ షాపు లైసెన్స్ రద్దు చేశారు. తాము అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సోషల్ మీడియా యూజర్లు జాతీయ పతాకాన్ని తమ డీపీగా పెట్టుకోవాలన్న ఉద్యమం కూడా ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన డీపీని అలాగే మార్చుకుని, అందరూ అలా జాతీయ జెండాను డీపీగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాంతో, అలా డీపీ పెట్టుకోని వారిని దేశభక్తి లేనివారుగా చిత్రించి, వారిని ఆన్లైన్ వేదికలపై వ్యక్తిగతంగా దూషించడం ప్రారంభమైంది. జాతీయ జెండాను డీపీగా పెట్టుకుంటేనే దేశభక్తి ఉన్నట్లా? అని ఈ విషయంపై కొందరు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
आजादी की 75वीं वर्षगाँठ का उत्सव गरीबों पर ही बोझ बन जाए तो दुर्भाग्यपूर्ण होगा।
— Varun Gandhi (@varungandhi80) August 10, 2022
राशनकार्ड धारकों को या तिरंगा खरीदने पर मजबूर किया जा रहा है या उसके बदले उनके हिस्से का राशन काटा जा रहा है।
हर भारतीय के हृदय में बसने वाले तिरंगे की कीमत गरीब का निवाला छीन कर वसूलना शर्मनाक है। pic.twitter.com/pYKZCfGaCV
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more