దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు చేపడుతున్నారు. అయితే ఈ మరమ్మతులు కాస్తా మరోమారు వర్షం పడగానే ఆ నీటికి కోట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లోని అనేక రహదారులు చెరువులా మారితున్నాయి..? వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుండటంతో వాహనదారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాగా భారీ వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అసలే కొండలు ప్రాంతం కాబట్టి అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి కూడా రహదారులు గొతుల మయంగా తయారయ్యాయి. ఇక వరద నీరు ప్రవహిస్తుండంతో స్థానిక యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. మలప్పురం ప్రాంతంలో రహదారులపై భారీగా ఏర్పడిన గోతుల్లో నీరు చేరింది. దీంతో హంజా పొరాలి అనే వ్యక్తి అదే నీటిలో యోగాసనాలు వేశాడు. అదే నీటితో స్నానం చేసి స్థానిక ఎమ్మెల్యేకు పరిస్థితి అర్థమయ్యేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ అవుతోంది.
తన వస్త్రాలను రహదారిపై నిలిచిన మురికి నీటితోనే ఉతుక్కున్నాడు పొరాలి. స్థానిక ఎమ్మెల్యే లతీఫ్ అక్కడకు చేరుకుని కారు నుంచి కిందకు దిగారు. ఎమ్మెల్యేను చూసిన హంజా పొరాలి నీటిలో ఒంటి కాలిపై నించుని యోగాసనం వేశాడు. ఇటీవలి వర్షాలకు కేరళలో రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఎర్నాకులం జిల్లా నెడుంబస్రేలో జాతీయ రహదారిపై గోతి కారణంగా 52 ఏళ్ల వ్యక్తి మరణించారు. దీంతో కేరళ హైకోర్టు కూడా రోడ్ల దుస్థితిపై తీవ్రంగా స్పందించింది. అన్ని రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని జాతీయ రహధారి మంత్రిత్వశాఖను ఆదేశించింది.
#WATCH | Kerala: A man in Malappuram protested against potholes on roads in a unique way by bathing & performing yoga in a water-logged pothole in front of MLA on the way pic.twitter.com/XSOCPrwD5f
— ANI (@ANI) August 9, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more