బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు విద్యార్థులు ఎగ్ కర్రీ రైస్ భోజనం చేయగా.. కలుషిత ఆహారం తినడంతో అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతులు చేసుకున్నవారికి వారి వారి హాస్టల్ రూముల్లోనే ఉంచి మాత్రలు ఇచ్చారు. అస్వస్థకు గురైన వారికి అంబులెన్స్తో పాటు ఫ్యాకల్టీ కార్లలో త్రిబుల్ ఐటీలోని ఆసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.
కాగా.. గతంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వివిధ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్ వీసీని నియమించాలనే డిమాండ్లతో ఆందోళన చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టూడెంట్లకు మద్దతు తెలిపేందుకు వచ్చేవాళ్లను అరెస్ట్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులనూ వదిలకుండా అరెస్టులు చేశారు. విద్యార్థుల నిరసనలపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్, ఎస్పీ పలు దఫాలుగా చర్చలు జరిపారు.
తమ సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్గానీ, మంత్రి కేటీఆర్గానీ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. ఈ పరిస్థితుల్లో బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరిపి.. ఆందోళనలకు ముగింపు పలికారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని, త్వరలోనే రెగ్యులర్ వీసీని నియమిస్తామని హామీ ఇచ్చారు. ల్యాప్టాప్స్ పంపిణీ, క్వాలిటీ ఫుడ్ సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, స్టూడెంట్స్ తమ ఆందోళన విరమించి క్లాసులకు హాజరుకావాలని కోరారు. ఈ క్రమంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరగడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more