కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా తీసుకువచ్చిన విధానం ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అర్హత పరీక్షలు రాసే వారితో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం అత్యంత అవసరం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని ఎదురుచూస్తే ఏళ్ల పాటు నిరీక్షించేవారు అధికం. ఇలాంటి వారి కోసం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) సంస్థ సీ టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీ టెట్ ఉత్తీర్ణులైన వారికి కేంద్రీయ విద్యాస్థంస్థలతో పాటు సీబిఎస్ఈ పాఠశాలలకు కూడా అర్హులు.
ఇక సీబిఎస్ఈ ప్రతీ ఏడాది రెండు పర్యాయాలు ఈ సీ-టెట్ పరీక్షలను నిర్వహిస్తుండగా, కరోనా మహమ్మారి విజృంభన నాటి నుంచి ఏడాదికో పర్యాయం మాత్రమే నిర్వహిస్తోంది. 2020, 2021లలో ఇలాగే నిర్వహించిన సీబిఎస్ఈ ఈ ఏఢాది డిసెంబర్ నెలలో సీటెట్ నిర్వహించేందుకు సన్నధం అవుతోంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. ఈ మేరకు పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు సంబంధించిన తేదీలను అభ్యర్థుల అడ్మిట్ కార్డుల్లో తెలియజేస్తామని తెలిపింది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్, అర్హత, లాంగ్వేజెస్, ఎగ్జామినేషన్ ఫీ, ఎగ్జామ్ సెంటర్లు, అప్లికేషన్ తేదీల వివరాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ https://ctet.nic.in/ లో త్వరలో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు పై వెబ్సైట్నుంచి ఇన్ఫర్మేషన్ బులిటెన్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదువాలని, ఆ తర్వాతే దరఖాస్తు చేయాలని సీబీఎస్ఈ సూచించింది. త్వరలోనే అప్లికేషన్ తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. కాగా, జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు పేపర్-1 లేదా పేపర్- 2కు అప్లికేషన్ ఫీజు రూ. వెయ్యి, రెండు పేపర్లకు రూ. 1200గా నిర్ణయించింది. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్సీ అభ్యర్థులకు పేపర్-1 లేదా పేపర్-2కు రూ. 500, రెండు పేపర్లకు రూ. 600గా నిర్ణయించినట్లు సీబీఎస్ఈ పబ్లిక్ నోటీస్లో పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more