హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మారేడుపల్లి సర్కిల్ ఇన్స్ పెక్టర్ నాగేశ్వర్ రావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయనపై అత్యాచారం, ఆయుధ చట్టం కింద కేసు నమోదైనట్లు రాచకొండ సీపీ నుంచి హైదరాబాద్ సీపీ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో నాగేశ్వర్ రావును విధుల నుంచి తప్పిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీదు, బోనాల పండుగ బందోబస్తు దృష్ట్యా కార్ఖానా సీఐ నేతాజీని మారేడుపల్లి ఇంచార్జీ సీఐగా సీవీ ఆనంద్ నియమించారు. బాధితురాలి భర్తపై కూడా సీఐ నాగేశ్వర్ రావు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మారేడుపల్లి సీఐ నాగేశ్వర్ రావుపై అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. సీఐ నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగేశ్వర్ రావు ఈ నెల 7వ తేదీన హస్తినాపురం శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. ఇంటికి వస్తున్నట్లు ఆమెకు సీఐ ముందే ఫోన్ చేసి చెప్పడంతో.. ఆ విషయాన్ని తన భర్తకు తెలిపింది. ఇక మహిళ ఇంటికొచ్చిన సీఐ.. ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఎదురు తిరిగిన అమెను రివాల్వర్తో బెదిరించి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అర్ధరాత్రి సమయంలో బాధితురాలి భర్త కూడా శ్రీ వెంకటేశ్వర కాలనీకి చేరుకుని.. తన భార్యపై అత్యాచారం చేస్తున్న సీఐని అడ్డుకున్నాడు. దీంతో బాధితురాలి భర్తను సీఐ రివాల్వర్తో బెదిరించాడు. ఆ తర్వాత ఆ దంపతులిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు బయల్దేరాడు. అయితే మార్గమధ్యంలో కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇదే అదనుగా బావించిని బాధిత భార్యభర్తలు.. సీఐ నుంచి తప్పించుకుని, వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ నాగేశ్వర్ రావును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అయనను ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more