పరువు నష్టం కేసులో హాలీవుడ్ నటుడు జానీ డెప్కు న్యాయపరమైన విజయం లభించింది. మాజీ భార్య అంబర్ హెర్డ్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వర్జీనియా కోర్టు జానీ డెప్కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. అయితే ఆ కేసులో ఇద్దరికీ నష్టపరిహారం దక్కేలా జడ్జి తీర్పును వెలువరించారు. డెప్కు 15 మిలియన్ల డాలర్లు చెల్లించాలని హెర్డ్కు కోర్టు ఆదేశించింది. ఇక హెర్డ్కు రెండు మిలియన్ల డాలర్లు చెల్లించాలని కూడా కోర్టు జానీ డెప్ను ఆదేశించింది. జానీ గృహ హింస వేధింపులకు పాల్పడినట్లు హెర్డ్ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే.
2018లో వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ భర్త డెప్పై హెర్డ్ గృహ హింస ఆరోపణలు చేసింది. తన పరువు తీసిందన్న ఉద్దేశంతో హెర్డ్పై 50 మిలియన్ల డాలర్ల పరువు నష్టం కేసును డెప్ దాఖలు చేశాడు. అయితే దానికి కౌంటర్గా డెప్పై 100 మిలియన్ల డాలర్ల పరువు నష్టం కేసును హెర్డ్ వేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ కేసులో విచారణ సాగింది. ఏడుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది.
పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ చిత్రంలో నటించిన జానీ డెప్, అంబర్ హెర్డ్లు 2011 నుంచి డేటింగ్లో ఉన్నారు. ఆ ఇద్దరూ 2105 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 15 నెలల వ్యవధిలోనే నటి హెర్డ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నది. డెప్ తనను లైంగికంగా వేధించినట్లు హెర్డ్ ఆరోపించింది. దీంతో ఒకరిపై ఒకరు పరవునష్టం కేసుల్ని దాఖలు చేసుకున్నారు. కెరీర్ నాశనం కావడానికి నువ్వే కారణమంటూ తమ తమ పిటిషన్లలో ఆరోపించారు. ఈ కేసు వల్ల ఫెంటాస్టిక్ బీస్ట్స్ చిత్రం నుంచి జానీ డెప్ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అక్వామాన్ చిత్రం నుంచి కూడా హెర్డ్ తన పాత్రను తగ్గించుకోవాల్సి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more